Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
బ్రహ్మానందం కొడుకు మూవీకి 115 మంది నిర్మాతలు: ‘మను’ ట్రైలర్ అదిరింది!
టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం వారసుడిగా హీరోగా తెరంగ్రేటం చేసిన రాజా గౌతమ్.... గతంలో 'పల్లకిలో పెళ్లికూతురు', 'బంసతి' చిత్రాల్లో నటించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత గౌతమ్ మళ్లీ 'మను' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షార్ట్ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫణీంద్ర నార్శెట్టి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాందినీ హీరోయిన్.
నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండెడ్గా ఈ చిత్రాన్ని నిర్మించారు. అంటే ఇందులో 115 మంది పెట్టుబడి పెట్టారట. సినిమా మీద పాషన్ ఉన్న వాళ్లు అంతా కలిసి దర్శకుడిపై నమ్మకంతో 4 రోజుల్లో రూ. 1 కోటి ఫండింగ్ చేశారట. తెలుగు సినిమా చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇంత మంది భారీ మొత్తం ఫండింగ్ చేయడం ఇదే తొలిసారని టాక్.
మిస్టరీ రొమాన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న 'మను' ట్రైలర్ చిత్ర యూనిట్ విడుదల చేశారు. తీగ కొండికి వానపామును ఎర వేస్తారు. వానపామును చూస్తూ తీగను వదిలేస్తుంది చేప. ఇరుక్కుంటుంది, ఎక్కువ చక్కెర నాలుకపై తియ్యగానే ఉంటుంది. కానీ, అది రక్తంలోకి కలిశాక గందరగోళం చేస్తుంది...అంటూ సాగు డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
డైరెక్టర్ ఫణీంద్ర మాట్లాడుతూ - ''ఇంత పెద్ద ప్రయాణం ఎక్కడ మొదలైందని చెప్పలేను. ఈ సినిమా కోసం వెయ్యి రూపాయల నుండి నలబై లక్షల వరకు ఇచ్చిన వాళ్లు ఉన్నారు. ఇది నాకు ఎమోషనల్ మూమెంట్. కాబట్టి ఇన్వెస్టర్స్ను మరచిపోలేను. ఎందుకు నమ్మారో తెలియదు కానీ.. అందరూ ఎంతగానో నమ్మారు.. అయితే ఎవరి నమ్మకాన్ని తగ్గించేలా సినిమా ఉండదని కచ్చితంగా చెప్పగలను అన్నారు.
రాజా గౌతమ్, చాందిని చౌదరి, జాన్ కొటొలి, మోహన్ భగత్, అభిరామ్, శ్రీకాంత్ ముళ్లగరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, ఆర్ట్: శివ్కుమార్, సౌండ్ డిజైన్: సచిన్ సుధాకరన్, హరిహరన్, సంగీతం: నరేష్ కుమారన్, నిర్మాణం: క్రౌడ్ ఫండింగ్ మూవీ(115 మెంబర్స్), రచన, దర్శకత్వం: ఫణీంద్ర నార్శెట్టి.