Don't Miss!
- News ఓటర్లను బెదిరించిన డీకేపై ఎఫ్ఐఆర్, అయ్యా అలా అనలేదని హైకోర్టులో పిటిషన్, అపార్ట్ మెంట్ లో ?
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సూపర్ స్టార్కి గాయాలు.. ఆందోళన చెందుతున్న అభిమానులు.. వైద్యులు ఏమన్నారంటే
Recommended Video
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అనుకోకుండా గాయాల పాలవడం ఆయన అభిమానులను కలవరపెడుతోంది. ఎప్పుడూ సినిమా షూటింగ్స్ చేస్తూ బిజీగా ఉండే రజినీకాంత్.. ఇప్పుడు ఓ టీవీ షో కోసం రిస్క్ చేస్తున్నారు. కర్ణాటకలో ఈ అడ్వెంచర్ షో షూటింగ్ జరుగుతుండగా రజినీకాంత్ గాయపడ్డారు. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగింది? రజినీ గాయాలపై వైద్యులు ఏమన్నారు? వివరాల్లోకి పోతే..
బందీపూర్ అటవీప్రాంతం.. షూటింగ్ మొదలు
డిస్కవరీ ఛానల్లో ప్రసారం అయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' అనే పాపులర్ అడ్వెంచర్ షోలో ఈ సారి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కనిపించనున్నారు. అయితే ఈ ఏడాదికి గాను షో షూటింగ్ కోసం సౌత్ ఇండియన్ స్టేట్ కర్ణాటకకు వచ్చేసింది టీమ్. ఆ రాష్ట్రంలోని బందీపూర్ అటవీప్రాంతంలో ఈ డాక్యుమెంటరీ షూటింగ్ మొదలుపెట్టారు.
సాహసవీరుడు బేర్ గ్రిల్స్తో రజినీ
జనవరి 28 మొదలుకొని 30వ తేదీ వరకు ఈ షూట్ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం బ్రిటన్ దేశానికి చెందిన సాహసవీరుడు బేర్ గ్రిల్స్ కర్ణాటక చేరుకొని రజినీకాంత్తో పాటు షూటింగ్లో పాల్గొంటున్నారు. రోజూ ఆరు గంటల పాటు మాత్రమే షూటింగ్ను నిర్వహించాల్సి ఉంటుందని కర్ణాటక అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అదుపుతప్పిన రజినీకాంత్.. గాయాలు
అయితే ఈ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్' షూటింగ్లో పాల్గొన్న రజినీకాంత్ అదుపుతప్పి కిందపడ్డారని, దీంతో ఆయన చేతికి, కాలికి గాయాలయ్యాయని తెలిసింది. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్లో షూట్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆ షూటింగ్ నిలిపివేయడం జరిగింది.
గాయం తీవ్రత.. అభిమానుల ఆందోళన
గాయం తీవ్రత ఎక్కువగా లేదని, రజినీకి స్వల్ప గాయాలే అయ్యాయని అని వైద్యులు తెలిపారు. దాంతో ఉన్నపలంగా ఆయన షూటింగ్కు ప్యాకప్ చెప్పి చెన్నై వెళ్లారు. మరోవైపు తమ అభిమాన హీరో రజినీకి గాయాలయ్యాయని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఎలా బతకగలగాలో చూపిస్తూ.. అదే ప్రత్యేకత
మేన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో బేర్ డ్రిల్స్తో పాటు ఓ సెలబ్రిటీ అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ సాహసాలు చేస్తుంటాడు. ఎలాంటి సదుపాయాలూ, ఆహారమూ లేకపోయినా అడవుల్లో, ఎడారుల్లో ఎలా బతకగలగాలో చూపిస్తుంటాడు. అందులో భాగంగా ప్రకృతిలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదురించాలో వివరిస్తాడు. అందుకే ఈ షోకి మంచి ఆదరణ లభిస్తోంది. గతేడాది ఇదే షోలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.