Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తస్సాదియ్యా అనడానికి రాంచరణ్ రెడీ.. కొన్ని గంటల్లోనే దుమారం..
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రం వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్నది. ఈ సినిమా ప్రమోషన్ను ఇప్పటికే ఓ రేంజ్లో స్టార్ట్ చేశారు. వరుసగా పాటలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్లో భాగంగా తస్సాదియ్యా అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేయనున్నది. ఆ సింగిల్కు సంబంధించిన ప్రమోషనల్ యాడ్ను విడుదల చేశారు.
భరత్ అనే నేను ఫేం కియారా అద్వానితో జత కట్టి పాడిన తస్సాదియ్యా అనే పాటను సోమవారం సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తాం. ఫ్యాన్స్ను ఈ పాట ఆలరించడం ఖాయమనే మాటను చిత్ర యూనిట్ వ్యక్తం చేసింది.
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ డీవీవీ బ్యానర్పై రూపొందిస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. బోయపాటి శ్రీను దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రం జనవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నది.