Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాంగోపాల్ వర్మకు తీరని విషాదం.. దేవుళ్లు, మోదీ, అమిత్ షా ఏం చేస్తున్నారంటూ ట్వీట్
కరోనావైరస్ విజృంభిస్తూ జీవితాలను విచ్చిన్నం చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పదునైన ట్వీట్లతో ప్రభుత్వాలను రఫాడిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కుంభమేళాను నిర్వహించిన అధికారులును, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలతో నిలదీస్తున్నారు. తాజాగా తనకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు గౌరవ్ శర్మ కరోనా బారిన పడి మరణించడంతో విషాదంలో మునిగిపోయారు.
ఈ విషాద సమయంలో రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ.. గత రెండు వారాల క్రితం కోవిడ్ పరిస్థితుల గురించి మేమిద్దరం చర్చించుకొన్నాం. స్ట్రామ్ శర్మగా పేరున్న గౌరవ్ శర్మను కోవిడ్ పొట్టన బెట్టుకోవడం జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన ఎంతో జీవితాన్ని చూశారు. అలాంటి వ్యక్తి మరణించారంటే నేను నమ్మలేకపోతున్నారు. మీకు ఆప్తులైన వారికి జరగకూడదని ఏదైనా జరిగితే వైరస్ ఇంత ప్రమాదకరమనేది అర్ధమవుతుంది అని అన్నారు.
కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాలపై సెటైర్లు వేశారు. హాస్పిటల్లో బెడ్స్ లేవు. శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ లేదు. వ్యాక్సిన్ల కొరత, చివరకు చస్తే కాల్చి వేయడానికి కట్టెలు కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో దేవతా దేవుళ్లు ఎక్కడ, నరేంద్రమోదీ, అమిత్ షా ఏం చేస్తున్నారు అంటూ ఘాటుగా రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.