Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విశాల్ ఎఫెక్ట్: లీగల్ సమస్యల్లో శరత్ కుమార్.. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై కేసు
తమిళ నటీనటులు సంఘం (నడిగర్ సంఘం) మాజీ అధ్యక్షులు, హీరో శరత్ కుమార్, రాధారవి లీగల్ సమస్యల్లో ఇరుక్కొననారు. వీరిపై యాక్టర్ విశాల్ నిధుల దుర్వినియోగం చేయడం కోలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఈ అసోసియేషన్ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయా లేదా అనే విషయాన్ని తేల్చడానికి తమిళనాడు ప్రభుత్వం ఓ అధికారిని నియమించడం జరిగింది. దీంతో తమిళ నిర్మాతల మండలికి కూడా షాక్ తగలబోతున్నది.
తమిళ నిర్మాత సంఘం అధ్యక్షుడు విశాల్ చేసిన ఆరోపణలు తమిళ సినిమా పరిశ్రమను కుదిపేసాయి. నిధుల అవకతవకలు జరిగాయని శరత్ కుమార్, రాధారవిపై ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరిపై చెన్నై పోలీసులు కేసు కూడా నమోదు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.
తాజా ఆరోపణల నేపథ్యంలో విశాల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం కనిపిస్తున్నది. విశాల్ను పదవి నుంచి తప్పుకోవాలని తమిళనాడు నిర్మాతల సంఘం కౌన్సిల్ డిమాండ్ చేస్తున్నది. ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం జిల్లా రిజిస్ట్రార్ను అధికారిగా నియమించింది. ఏడాదిపాటు అసోసియేషన్ ఆర్థిక వ్యవహారాలను పరిశీలించే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.