Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నడి సముద్రంలో ఇద్దరు హీరోల ఫైటింగ్: గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్లాన్
తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఎన్నో వస్తున్నాయి. పెద్ద పెద్ద స్టార్లతో పాటు చిన్న హీరోలు కూడా ఇలాంటి చిత్రాల్లో నటించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇద్దరు టాలెంటెడ్ హీరోలు శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తోన్న చిత్రం 'మహాసముద్రం'. ఆరంభంలోనే 'RX100' వంటి సూపర్ డూపర్ హిట్ మూవీని తెరకెక్కించి టాలీవుడ్లో సెన్సేషన్ అయిన అజయ్ భూపతి దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా రాబోతున్న 'మహాసముద్రం'లో ఇద్దరు హీరోల మధ్య భీకర పోరు జరుగుతుంటుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాలోని పోస్టర్లు డిజైన్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో హీరోలు శర్వానంద్, సిద్దార్థ్ ప్రత్యర్థులుగా నటిస్తున్నారట. అంతేకాదు, ఇంటర్వెల్కు ముందు వీళ్లిద్దరి మధ్య నడి సముద్రంలో ఓ ఫైటింగ్ సీన్ ఉంటుందని తెలిసింది. ఇది సినిమాకే హైలైట్గా నిలుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఇప్పటి వరకూ తెలుగు ప్రేక్షకుల చూడని విధంగా దీన్ని డిజైన్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అజయ్ భూపతి డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న 'మహాసముద్రం' చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అనిల్ సుంకర దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అదితి రావ్ హైదరీతో పాటు అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా చేస్తోంది. ఓ సీనియర్ హీరోయిన్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. సున్నితమైన ప్రేమకథకు భావోద్వేగాలను జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీన్ని ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.