Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆమె రిచెస్ట్ ఇండియన్, రియల్ హీరో.. ఏపీ యువతి గురించి సోనూసూద్ ఆసక్తికర ట్వీట్!
సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు, దస్కం, కీర్తి ప్రతిష్ట కాదు సాయం చేయాలనే మంచి మనసు ఉండాలి. ఈ రోజుల్లో అలాంటివాళ్లు దొరకటం చాలా అరుదు. అసలు ఏ మాత్రం పరిచయం లేకపోయినా సరే తనను ఇంతటి వాడిని చేశారు అన్న ఏకైక కారణంతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాక భారతదేశంలో అందరికీ సాయం చేస్తున్నారు. ఏ మూలన ఏ అవసరం వచ్చిందని సోషల్ మీడియా వేదికగా ఆయన దృష్టికి తీసుకువెళ్లినా సరే ఆయన వెంటనే స్పందిస్తున్నారు. అలాగే తనలా సేవ చేయాలనే కోరిక ఉన్న అందరూ డబ్బు సాయం చేసేందుకు గాను సోనూసూద్ ఫౌండేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు.
ఇప్పటిదాకా ఆయనకు ఎంతమంది విరాళాలు అందించారో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక దివ్యాంగురాలు అయిన యువతి చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా వరికుంటపాడు అనే గ్రామానికి చెందిన బొడ్డు నాగలక్ష్మి అనే దివ్యాంగురాలు అంధత్వంతో బాధపడుతున్నారు. అయినా సరే ఏ మాత్రం తనలో ఆత్మన్యూనతా భావం లేకుండా తాను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. ఆవిడ తాజాగా సోనూసూద్ ఫౌండేషన్కు 15 వేల రూపాయలు విరాళంగా అందించారు. అది కూడా ఆమె ఆమె రెండు నెలలుగా తీసుకుంటున్న పెన్షన్ మొత్తం.
Boddu Naga Lakshmi
— sonu sood (@SonuSood) May 13, 2021
A Blind girl and a youtuber.
From a small village Varikuntapadu in andra Pradesh
Donated 15000 Rs to @SoodFoundation & that's her pension for 5 months.
For me she's the RICHEST Indian.
You don't need eyesight to see someone's pain.
A True Hero🇮🇳 pic.twitter.com/hJwxboBec6
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అలా ఐదు నెలల పెన్షన్ ను ఆమె సోనూసూద్ ఫౌండేషన్ కు విరాళం ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె గురించి ట్వీట్ చేసిన సోనూసూద్ తనవరకు ఆవిడ భారతదేశంలో ధనికురాలు అని పేర్కొన్నారు, అలాగే ఒకరి బాధను అర్థం చేసుకోవడానికి కళ్ళతోనే చూడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఆవిడ ఒక నిజమైన హీరో అని సోనూసూద్ కొనియాడారు. ఇక సదరు యువతితో సోనూసూద్ ఫోన్లో కూడా మాట్లాడారు. ఈ మేరకు సదరు యువతి తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు.