నంద గోపాల లీలలకు సెన్సార్ ఫిదా.. సూర్య మూవీకి గ్రీన్ సిగ్నల్
విలక్షణ నటుడు సూర్య నటించిన ఎన్జీకే (నంద గోపాల కృష్ణ) చిత్రం విడుదలకు గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. రాజకీయ అంశాలతో ఆధారంగా, పొలిటికల్ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రానికి డైరెక్టర్ సెల్వరాఘవన్. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
తమిళంలో గత ఆరేళ్లలో సెల్వరాఘవన్కు సంబంధించిన ఏ సినిమా విడుదల కాకపోవడం, ఏడాదిన్నరగా సూర్య సినిమా రిలీజ్ కాకపోవడం, ఆ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్లో వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులు ఎన్జీకే చిత్రాన్ని చూసి సంతృప్తిని వ్యక్తం చేశారనేది తాజా సమాచారం. ఈ చిత్రానికి సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో రిలీజ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాను మే 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఎన్జీకే చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను రిలీజ్కు ఏర్పాట్లు చేస్తూనే మరో పక్క సూర్య సూరరాయ్ పొట్రూవోమ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గురు ఫేం సుధా కొంగర దర్శకురాలు. అలాగే కేవీ ఆనంద్ దర్శకత్వంలో కాప్పన్ సినిమాక కూడా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.


Click it and Unblock the Notifications











