Just In
- 24 min ago
ప్రభాస్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
- 40 min ago
‘మాస్టర్’ డైరెక్టర్తో జూనియర్ ఎన్టీఆర్: కాంబినేషన్ సెట్ చేసిన ప్రముఖ నిర్మాత
- 1 hr ago
ఇంతకంటే మంచి సినిమా ఉంటుందా.. ‘మాస్టర్’పై కుష్బూ కామెంట్స్
- 1 hr ago
బాలీవుడ్లోకి ‘క్రాక్’: రవితేజ పాత్రలో రియల్ హీరో.. అదిరిపోయే ప్లాన్ రెడీ
Don't Miss!
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- News
Corona Vaccine: ఐటీ హబ్ లో కోటి మంది ప్రజలు, 8 కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలు, 1 లక్ష వ్యాక్సిన్ లు!
- Automobiles
పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?
- Sports
మూడో సెషన్ రద్దు.. ముగిసిన రెండోరోజు ఆట!! భారత్ స్కోర్ 62/2!
- Finance
మొబైల్ నెంబర్కు కాల్ చేయాలంటే సున్నాను చేర్చండి, గుర్తు చేస్తున్న టెల్కోలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మాకు కూడా న్యాయం చేయండి.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుగు నిర్మాతల మండలి వినతి!
ఇటీవల తమిళనాడు ప్రభుత్వం సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే తెలుగు రాష్ట్రాల్లోను ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను టాలీవుడ్ నిర్మాతల మండలి వినతి పాత్రలను అందజేసింది. మొదట్లో కనీసం 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.
కానీ ఇప్పుడు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడపడం వల్ల థియేటర్ల నిర్వహణకు ఎక్కవ ఖర్చు అవుతుందని, దీని వల్ల థియేటర్ల యాజమాన్యాలు నష్టాలను భరించాల్సి వస్తోందని అందుకే 100 శాతంకు పెంచుతూ, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లు నడుపుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కోలీవుడ్ ఇండస్ట్రీకి 100శాతం సీటింగ్ సామర్ధ్యానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్ని ఇండస్ట్రీలలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్న క్రమంలో థియేటర్ల యాజమాన్యాలు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకుని తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదే తరహాలో తమకు కూడా న్యాయం చేయాలని తెలుగు నిర్మాతల మండలి కోరింది. లేఖల ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గౌరవ ముఖ్యమంత్రులు, గౌరవ మంత్రులు, ప్రభుత్వ విభాగాధిపతులను అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే సినిమా థియేటర్ల నిర్వహణకు, సినీ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కూడా వారు తెలియజేశారు.