జెండా సాక్షిగా ప్రపంచాన్ని మరిచారు.. గాఢమైన కౌగిలి ఆ ఇద్దరు బందీ..
Recommended Video

సెలబ్రిటీ పెళ్లిళ్లలో బాలీవుడ్ తార అనుష్కశర్మ, క్రికెట్ వీరుడు విరాట్ కోహ్లీ మ్యారేజ్ ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. పెళ్లి తర్వాత ఫిన్లాండ్లో హానీమూన్కు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలో విందును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విరాట్ విదేశీ టూర్లలో, అనుష్క షూటింగ్ బిజీగా మారారు. వారి మధ్య ఇటీవల కొంత ఎడబాటు కలిగింది. చాలా రోజుల తర్వాత కలిసిన వారిద్దరూ ప్రపంచాన్ని మరిచిపోయి ఏమి చేశారో మీరే చూడండి..

అనుష్మశర్మ షూటింగ్తో బిజీ
పెళ్లి అనుష్కశర్మ తర్వాత షారుక్ ఖాన్ జీరో సినిమా, పరి, ఆ తర్వాత సూయి దాగా.. మేడ్ ఇన్ ఇండియా అనే చిత్రాల్లో నటిస్తున్నది. సూయి దాగా అనే చిత్ర షూటింగ్ కోసం అనుష్క భోపాల్ వెళ్లింది. చాలా రోజుల తర్వాత ముంబైకి తిరిగి వచ్చిన అనుష్కను రిసీవ్ చేసుకోవడానికి విరాట్ కోహ్లీ ఎయిర్పోర్టుకు వచ్చారు.

విరాట్ కోహ్లిని చూడగానే
ఎయిర్పోర్టు వద్ద విరాట్ను చూడగానే ముద్దులతో ముంచెత్తింది. ఆ తర్వాత వాహనంలోకి వెళ్లి గాలి దూరనంతగా వారిద్దరూ కౌగిలించుకొన్నారు. అలా గాఢమైన కౌగిలిలో ఒకరికొకరు బందీ కావడం మీడియా కంట్లో పడింది.

అనుష్కతో ప్రేమగా
భోపాల్ నుంచి వచ్చిన అనుష్కతో ప్రేమగా విరాట్ కోహ్లీ

అనుష్కతో ఆనందంగా
అనుష్కతో ఆనంద క్షణాలను పంచుకొంటున్న విరాట్ కోహ్లీ

గతంలో విరాట్
ఇటీవల అనుష్కను గాఢంగా కౌగిలిలో బంధించిన ఫోటోను విరాట్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. ఆ ఫోటోకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.


Click it and Unblock the Notifications











