Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Anurag Kashyap మాటలకు వివేక్ అగ్నిహోత్రి ట్వీట్స్ వార్.. ముందు రీసెర్చ్ చేయండి అంటూ కౌంటర్
ఇటీవల కాలంలో బాలీవుడ్ దర్శకుల మధ్య కొంత మాటల యుద్ధం ఎక్కువవుతొంది. ప్రముఖ రచయిత దర్శకుడు అనురాగ్ కశ్యప్ రీసెంట్ గా సౌత్ సినిమాలు ఇండస్ట్రీని దారుణంగా నాశనం చేశాయి అని ఆయన చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యాన్ని గురిచేసాయి. ఒక విధంగా ప్రేక్షకుల అంచనాలను కూడా కాంతార, పుష్ప సినిమాలు మార్చేశాయని ఇకనుంచి సినిమా మేకింగ్ విధానం కూడా పూర్తిగా మార్చుకోవాల్సిందే అని తరహాలో కూడా ఆయన వివరణ అయితే ఇచ్చారు. అయితే ఈ విషయంలో కొంతమంది సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కూడా ఊహించని విధంగా సోషల్ మీడియా ద్వారానే ఆయనకు కౌంటర్ ఇవ్వడం వైరల్ గా మారింది. అనురాగ్ కశ్యప్.. కాంతార, పుష్ప లాంటి సినిమాలు ఇండస్ట్రీని నాశనం చేశాయి అని అన్నారు. అయితే ఆ సమాధానం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని ఇందులో నేను ఏ మాత్రం ఏకీభవించడం లేదు ఆయన కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆ ట్వీట్ కు అనురాగ్ స్పందిస్తూ.. సార్ ఇది మీ తప్పు కాదు. మీ సినిమాల రీసెర్చ్ అనేది నా సంభాషణలపై మీరు చేసిన ట్వీట్ తరహాలోనే ఉంది.

మీ పరిస్థితి, మీ మీడియా పరిస్థితి కూడా అలాగే ఉంది. తదుపరి సారి కొంత తీవ్రమైన రీసెర్చ్ చేస్తే బాగుంటుంది అని అనురాగ్ కౌంటర్ గా మరో ట్వీట్ చేశారు. ఇక అనురాగ్ కామెంట్ పై రియాక్ట్ అయిన వివేక్ ఈ విధంగా స్పందించారు. 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా కోసం నాలుగు సంవత్సరాల నా రీసెర్చ్ అంతా అబద్ధమని నిరూపించండి. అలాగే గిరిజా టికూ, బికె గంజు, ఎయిర్ఫోర్స్ హత్య, నడిమార్గ్ - అన్నీ అబద్ధాలేదనా.. 700 మంది పండితుల వీడియోలన్నీ అబద్ధాలేనా.. హిందువులు ఎవరూ చనిపోలేదా? అంటూ.. దీన్ని నిరూపించండి, తద్వారా నేను మరోసారి తప్పు చేయను.. అని అగ్నిహోత్రి అనురాగ్ కు కౌంటర్ గా మరో ట్వీట్ లో అన్నారు.