Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అలా కన్విన్స్ అయ్యా... లేకపోతే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ చేసేవాడిని కాదు: షాహిద్ కపూర్
తెలుగులో సూపర్ హిట్ అయిన కల్ట్ మూవీ 'అర్జున్ రెడ్డి' హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నారు. 'కబీర్ సింగ్' పేరుతో ఈ మూవీ జూన్ 21న విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''అర్జున్ రెడ్డి' సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. ఒక కల్ట్ చిత్రాన్ని తెరకెక్కించిన విధంగా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే 'అర్జున్ రెడ్డి' సినిమా చూసిన వెంటనే నాకు ఒకటే ఆలోచన వచ్చింది... ఒక మంచి చిత్రాన్ని మళ్లీ చేయడం ఎందుకు? ఒక వేళ ఆ మ్యాజిక్ క్రియేట్ చేయలేక పోతే పరిస్థితి ఏమిటి? అనిపించింది.'' అని షాహిద్ చెప్పుకొచ్చారు.
కానీ నా సన్నిహితులు ఈ సినిమా చేయాలని ప్రోత్సహించారు. నేను ఒక మంచి పాత్ర చేసే అవకాశం వదులుకోవద్దని వారు సూచించారు. అపుడు వారికి నేను ఒకటే కండీషన్ పెట్టాను. ఒరిజినల్ సినిమాను డైరెక్ట్ చేసిన వారే ఈ సినిమా చేయాలి, లేకుంటే చేయను అని చెప్పాను. వేరే వారు అయితే ఆ పాత్రను పూర్తిగా అర్థం చేసుకోలేరనేది నా భావన. లక్కీగా సందీప్ రెడ్డి వంగా హిందీలో చేయడానికి ఒప్పుకున్నారు. నేను కన్విన్స్ అవ్వడానికి ప్రధాన కారణం అదే అని షాహిద్ కపూర్ తెలిపారు.