Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కియారా అద్వానీపై టాలీవుడ్ హీరోల ఫోకస్.. డేట్స్ అడ్జస్ట్ చేయలేక రిజెక్ట్ చేస్తున్న బ్యూటీ?
ఒకప్పుడు బాలీవుడ్ వెళ్లిన హీరోయిన్స్ మళ్ళీ తెలుగు సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. కానీ ప్రస్తుతం మాత్రం ఎవరైనా సరే కథను బట్టి పాత్రను చూసి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సైతం అదే తరహాలో వెలుతోంది. ఓ వైవు బాలీవుడ్ లో పెద్ద సినిమాలు చేస్తూనే మరోవైపు టాలీవుడ్ లో కూడా బడా ప్రాజెక్టులలో ఛాన్సులు అందుకుంటోంది.
ఇదివరకె మహేష్ బాబుతో భరత్ అనే నేను, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాల్లో నటించి తెలుగు జనాలకు దగ్గరయ్యింది. ఇక రానున్న రోజుల్లో కియారా అద్వానీ తెలుగులో మరింత బిజీ కానున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ - శంకర్ సినిమాలో ఫిక్స్ అయినట్లు టాక్ అయితే వస్తోంది. కొరటాల శివ - ఎన్టీఆర్ సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
అలాగే అల్లు అర్జున్ ఐకాన్ లో కూడా ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలు కూడా పెద్ద సినిమాలను లైన్ లో పెట్టనున్నారు కాబట్టి వారికి కూడా ఈ స్టార్ బ్యూటీ అవసరం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ప్రస్తుతం సౌత్ నుంచి భారీగా ఆఫర్స్ వస్తుండడం అమ్మడు తొందరకూడకుండా ముందు డేట్స్ కూడా చూసుకుంటోందట. డేట్స్ అడ్జస్ట్ చేయవచ్చు అంటేనే ఒప్పుకుంటోందట. లేకపోతే చేయలేను అని మొహం మీదే ఓపెన్ గా చెప్పేస్తోందట. మరి కియారా అద్వానీ ఈ వరుస ఆఫర్లతో ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.