Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వరద బాధితులకు జెనీలియా-రితేష్ దేశ్ముఖ్ రూ. 25 లక్షల విరాళం
కుండపోత వర్షాల కారణంగా వరదలు రావడంతో మహారాష్ట్రల్లోని కొల్హాపూర్, సాంగ్రి జిల్లాల్లో పరిస్థితి మరీ భయానకంగా మారింది. భారీ సంఖ్యలో జనం నిర్వాసితులయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, కోస్ట్ గార్డ్ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
వరద బాధితుల కోసం సినీ ప్రముఖులు తమవంతుగా సహాయం అందిస్తున్నారు. తాజాగా నటి జెనీలియా, రితేష్ దేశ్ముఖ్ దంపతులు వరద బాధితుల కోసం రూ. 25 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ దంపతులు చెక్కు అందిస్తున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. వరద బాధితుల కోసం రూ. 25 లక్షలు సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Thank you Riteish and Genelia Deshmukh for the contribution of ₹25,00,000/- (₹25 lakh) towards #CMReliefFund for #MaharashtraFloods !
— Devendra Fadnavis (@Dev_Fadnavis) August 12, 2019
@Riteishd @geneliad pic.twitter.com/Y6iDng2epD
890 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 100 టిఎంసి సామర్ధ్యంతో కూడిన భారీ కోయానా డ్యాం ఈ ఏడాది కేవలం తొమ్మిది రోజుల్లో సగం లేదా అంతకంటే ఎక్కువగా 50 టిఎంసిలతో నిండిపోయింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 432 తాత్కాలిక సహాయ శిబిరాలకు వరద బాధిత సాంగ్లి, కొల్హాపూర్, సతారా జిల్లాల నుంచి 3.78 లక్షల మందిని తరలించారు.