Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వివాదం: తాగుబోతు హీరోయిన్ అంటూ ఆమెపై మెగాస్టార్ బిగ్ బి ఫ్యాన్స్ ఫైర్!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా గ్యాంగ్ రేప్ ఘటనను పలువురు సినీ సెలబ్రిటీలు ఖండించడంతో పాటు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇటీవల మీడియా కంట పడిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను ఈ విషయమై స్పందించాల్సిందిగా కోరగా...దీనిపై స్పందించడానికి తనకు అసహ్యంగా ఉంది, ఈ సమస్యను రేకెత్తించవద్దు, దీని గురించి మాట్లాడటడం కూడా టెర్రిబుల్ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ ఘటనపై స్పందించడానికి అమితాబ్ నిరాకరించడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. అంత పెద్ద దారుణం జరిగితే అమితాబ్ స్పందించక పోవడం ఏమిటి? అంటూ కొందరు ఆయన తీరును తప్పుబట్టారు.
అమితాబ్ మీద కామెంట్ చేసి వివాదంలో పడ్డ పూజా భట్
కథువా ఘటనపై అమితాబ్ స్పందించక పోవడంపై బాలీవుడ్ నటి, దర్శకురాలు పూజా భట్ స్పందిస్తూ.... ‘ బిగ్ బికి ‘పింక్' సినిమాను గుర్తుచేయాలనుకుంటున్నాను. సినిమాలో చూపించిన విధంగానే నిజ జీవితంలోనూ ఉండలేరా?' అంటూ ప్రశ్నించారు.
తాగుబోతు అంటూ పూజాపై ఫ్యాన్స్ ఫైర్
అమితాబ్ మీద కామెంట్ చేయడంతో కొందరు బిగ్ బి అభిమానులు పూజా మీద విరుచుకుపడ్డారు. నువ్వు ఒక పెద్ద తాగుబోతువి. అమితాబ్ లాంటి పెద్ద యాక్టర్ మీద కామెంట్స్ చేసి పబ్లిసిటీ పెంచుకోవాలనుకుంటున్నావా? అంటూ ఫైర్ అయ్యారు.
నేను తాగుబోతునే, ఇపుడు కోలుకుంటున్నాను
అమితాబ్ బచ్చన్ అభిమానులు చేసే కామెంట్లకు పూజా భట్ ధీటుగా సమాధానం ఇచ్చింది. తాను కోలుకుంటున్న తాగుబోతుని, ఇలా చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను. చాలా మందికి డ్రింకింగ్ ఒక సమస్య అనే విషయం కూడా తెలియదు, దాని గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అలాంటి సమూహం నుండి నేను వేరుగా ఉన్నందుకు గొప్పగా ఫీలవుతున్నాను... అంటూ పూజా భట్ ట్వీట్ చేశా
అమితాబ్ పింక్
అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలో ‘పింక్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో అత్యాచారానికి గురైన బాధితురాలిగా తాప్సీ నటించగా, వారికి న్యాయం చేయడానికి పోరాడే లాయర్ పాత్రలో అమితాబ్ నటించారు. కథువా ఘటనపై అమితాబ్ స్పందించడం ఇష్టం లేదని చెప్పడంతో ఆయనకు ‘పింక్' సినిమా గుర్తు చేస్తున్నట్లు పూజా భట్ కామెంట్ చేశారు.