Don't Miss!
- News Telangana Loksabha Polls 2024:కేసీఆర్ కుటుంబాన్ని ఆ భయం వెంటాడుతోందా....!!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రిషి కపూర్ ఇంటిని పాకిస్థాన్ ఏం చేయబోతోందో తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ ఇంటిని పాకిస్థాన్ ప్రభుత్వం మ్యూజియంగా మార్చబోతోంది. పెషావర్లోని ఖిస్సా ఖ్వానీ బజార్లో రిషీ కపూర్ పూర్వీకులకు ఇల్లు ఉంది. తమ ఇంటిని మ్యూజియంగా మార్చాలని రిషీ కపూర్ కోరడంతో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ అందుకు అంగీకరించారు.
''మాకు రిషీ కపూర్ ఫోన్ చేశారు. పెషవర్లోని తమ పూర్వీకుల ఇంటిని మ్యూజియంగా మార్చడం లేదా ఏదైనా ఇనిస్టిట్యూషన్ కోసం కేటాయించాలని కోరారు. ఆయన రిక్వెస్ట్ పాకిస్థాన్ ప్రభుత్వం ఆమెదిస్తోంది'' అని ఖురేషి ఇండియన్ జర్నలిస్టులకు తెలిపారు.
ముదిరిన ఎఫైర్: హోటల్లో రూమ్ బుక్ చేసుకున్న హీరో హీరోయిన్?
పాకిస్థాన్ అంతర్గత మంత్రి షెహ్య్రార్ ఖాన్ అఫ్రిది కూడా ఈ విషయాన్ని ఖరారు చేశారు. రిషి కపూర్ తమ ఇంటిని మ్యూజికంగా మార్చాలని కోరారని, దానిపై తాము పాజిటివ్గా స్పందించినట్లు తెలిపారు.
రిషీ కపూర్... ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ కుమారుడనే విషయం తెలిసిందే. రాజ్ కపూర్ ఫ్యామిలీ దేశ విభజన సమయంలో పెషావర్ నుంచి ఇండియా వచ్చి సెటిలయ్యారు. పెషావర్లో వారు నివసించిన ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది.