Don't Miss!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఊచలు లెక్కపెట్టనున్న సల్మాన్.. ఈ రాత్రికి జైలులోనే..
కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దోషిగా తేలాడు. రాజస్థాన్లోని జోధ్పూర్ కోర్టు సల్మాన్ఖాన్కు ఐదేళ్ల జైలుశిక్షతోపాటు 10 వేల రూపాయల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. జోధ్పూర్ కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో ఈ రాత్రికి సల్మాన్ ఖాన్ జైలులోనే గడుపనున్నారు.
1998 నాటి జరిగిన ఈ సంఘటనలో బాలీవుడ్ నటులు సైఫ్ ఆలీ ఖాన్, టబు, సొనాలి బింద్రే, నీలమ్, దుష్యంత్ సింగ్ తదితరులు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. జోధ్పూర్కు చెందిన బిష్ణోయ్ కమ్యూనిటీ వీరిపై కేసు నమోదు చేసింది.
కృష్ణ జింకల కేసులో సల్మాన్ ఖాన్కు గతంలో ట్రయల్ నిర్ధోషిగా ప్రకటించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ బిష్ణోయ్ కమ్యూనిటి జిల్లా కోర్టులో అప్పీల్ చేసింది. దాంతో తిరిగి విచారణ చేపట్టారు.
కృష్ణ జింకల కేసులో దోషిగా నిర్ధారింపబడిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ బెయిల్ కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోనున్నారు. గురువారం బెయిల్ లభించని నేపథ్యంలో జోధ్పూర్ జైలులో సల్మాన్ ఖాన్ గడుపనున్నారు.