Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
NRA :' ఆగడు'....'గోవిందుడు అందరివాడేలే' ఒకరికే
హైదరాబాద్ : కృష్ణవంశీ సినిమా అంటే.. ఇంటిల్లిపాదీ చూడాల్సిందే. కుటుంబ కథా చిత్రాలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన కృష్ణవంశీకి కొంతకాలంగా హిట్ లేదు. ఇప్పుడాయన 'గోవిందుడు అందరివాడేలే' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉండటంతో బిజినెస్ బాగా జరుగుతోంది. తాజాగా గుంటూరు ఏరియా ఫైనలైజ్ చేసారు. అక్కడ ఎస్ క్రియేషన్స్ వారు ఈ చిత్రం రైట్స్ ని తీసుకున్నారు. ఆగడుని కూడా వీరే డిస్ట్రిబ్యూట్ చేస్తూండటం విశేషం. ఆగడుకు 4.25 కోట్లు పెట్టితీసుకుంటే, గోవిందుడు అందరి వాడేలే చిత్రానికి 4 కోట్లు వెచ్చించినట్లు (NRA పద్దతి) ట్రేడ్ వర్గాల సమాచారం.
'గోవిందుడు..' కృష్ణవంశీ కెరీర్ని మళ్లీ హైవే ఎక్కిస్తుందని యూనిట్ అంతా నమ్మకంగా చెబుతోంది. ప్రచార చిత్రాలు చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తోంది. ఆ కష్టం ఫలించి.. 'గోవిందుడు..' కాసుల వర్షం కురిపిస్తే అంతకంటే కావల్సిందేముంది? అంటున్నారు. అక్టోబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
'గోవిందుడు అందరివాడేలే' తాజా సమాచారం ...
లండన్లో పుట్టి పెరిగి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అలవాటు పడిన అభిరామ్ అనే యువకుడు తన మూలాల్ని వెతుక్కుంటూ ఓ అందమైన తెలుగు పల్లెకు వస్తాడు. అక్కడ అతను సరికొత్త జీవితాన్ని దర్శిస్తాడు. పల్లె అప్యాయతలు, అనుబంధాలకు ముగ్ధుడవుతాడు. అభిరామ్ అందరివాడనిపించుకుంటాడు. ఈ క్రమంలో జరిగే భావోద్వేగభరిత సంఘటనల సమాహారమే గోవిందుడు అందరివాడేలే చిత్ర ఇతివృత్తం అన్నారు కృష్ణవంశీ.
ఆయన దర్శకత్వంలో రామ్చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం లండన్లోని సుందరమైన లొకేషన్లలో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నెల 15న ఆడియోను, అక్టోబర్ 1న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ కుటుంబ బంధాలకు దర్పణంలా ఈ సినిమా వుంటుంది. రామ్చరణ్ పాత్ర చిత్రణలో భిన్న పార్శాలుంటాయి.
మా బ్యానర్కు మరింత గుర్తింపునిచ్చే చిత్రమవుతుంది అన్నారు. ప్రకాష్రాజ్, జయసుధ, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్శంకర్రాజా, ఆర్ట్: అశోక్కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్లక్ష్మణ్, రచన: పరుచూరి బ్రదర్స్, దర్శకత్వం: కృష్ణవంశీ.