Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘గోపాల గోపాల’లో పవన్ కి వచ్చిన షేర్ అంతేనా?
హైదరాబాద్ : వెంకటేశ్, పవన్కల్యాణ్ మొదటిసారి కలిసి నటించిన ‘గోపాల గోపాల'. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 10వ తేదీన విడుదలయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం ద్వారా 20 కోట్లు పవన్ కి షేర్ వచ్చింది. అందులో 15 కోట్లు పవన్, ఐదు కోట్లు శరద్ మరార్ తీసుకున్నట్లు సమాచారం. సినిమాలో పవన్ 50 నిముషాలు నటించారు. వెంకటేష్ కు 6.5 కోట్లు రెమ్యునేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలింది సురేష్ బాబు తీసుకున్నట్లు తెలుస్తోంది.
సురేశ్ ప్రొడక్షన్స్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సురేశ్, శరత్మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్కుమార్ పార్దసాని దర్శకుడు. వెంకటేశ్ జోడీగా శ్రియ నటించింది. హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్'కు రీమేక్గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం పది రోజుల కలెక్షన్స్ ఈ క్రింద ఇస్తున్నాం డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ దాదాపు 40 కోట్లుకు రీచ్ అవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఫేస్బుక్
ద్వారా
లేటెస్ట్
అప్డేట్స్
ఎప్పటికప్పుడు
చిత్రం
కథేమిటంటే...
దేవుడంటే నమ్మకం లేని నాస్తికుడైన గోపాల రావు(వెంకటేష్) ... దేముడి బొమ్మల దుకాణం నడుపుతుంటాడు. మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలిపోతుంది. ఇన్సూరెన్స్ కోసం వెళితే యాక్ట్ ఆఫ్ గాడ్ (ప్రకృతి వైపరిత్యాల) క్రింద దాన్ని పరిగణించి, అది దేముడి తప్పిందం చెప్తూ పైసా కూడా ఇవ్వలేమని కంపెనీ వారు చెప్తారు. ఈ నేపధ్యంలో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో గోపాల రావు ఆ గాడ్(దేముడి) తన నష్టానికి బాధ్యుడు కాబట్టి ఆయన మీదే కేసు వేస్తాడు. దేముడుకి వ్యతిరేకంగా వాదించటానికి ఏ లాయిరూ ముందుకు రాకపోయేసరికి గోపాలరావు స్వయంగా తానే వాదించుకోవటం మొదలెడతాడు. దేముడు ప్రతినిధులుగా చెప్పబడే స్వామీజీలను, మఠాథిపతులను, బాబాలను కోర్టుకు లాగుతాడు.
దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. దాంతో గోపాల రావుకు వ్యతిరేకంగా నిరసనలు చుట్టముడతాయి. దేముడుకు వ్యతిరేకంగా వెళ్లతావా అంటూ అతని బార్య(శ్రియ) అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది...అంతా అతన్ని ఒంటిరివాడిని చేస్తారు. మరో ప్రక్క తాము కోర్టుకు లాగబడటంతో అందులో దొంగ స్వామీజిలకు కోపం వచ్చి(పోసాని, మిధున్ చక్రవర్తి) భౌతిక దాడులతో అతన్ని అడ్డు తప్పించాలనుకుంటారు. అప్పుడు భగవంతుడు గోపాలుడే(పవన్ కళ్యాణ్) రంగంలోకి దిగి గోపాలరావుని ఆ సమస్యల నుంచి ఒడ్డెంక్కించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఏ విధంగా ఆ గోపాలుడు...ఈ గోపాలరావుని ఆదుకున్నాడు అనేది మిగతా కథ.
ఈ
చిత్రానికి
అనూప్
రూబెన్స్
సంగీతం.
మిగతా
ముఖ్య
పాత్రల్లో..
మిధున్చక్రవర్తి,
పోసాని,
కృష్ణుడు,
రఘుబాబు,
రంగనాధ్,
రాళ్ళపల్లి,
వెన్నెల
కిషోర్,
పృథ్వి,
దీక్షాపంత్,
నర్రా
శీను
తదితరులు
నటించారు.