Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
యూఎస్ఏలో $3.5 మిలియన్ దాటిన ‘రంగస్థలం’
'రంగస్థలం' చిత్రం విడుదలైనప్పటి నుంచి అన్ని ఏరియాల్లో సూపర్ డూపర్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. యూఎస్ఏలో ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం క్రియేట్ చేసింది. నాన్ బాహుబలి కేటగిరీలో ఇప్పటికే $3 మిలియన్ డాలర్ మార్కును దాటిన తొలి తెలుగు చిత్రంగా రికార్డుల కెక్కిన ఈ చిత్రం తాజాగా $3.5 మిలియన్ మార్కును అందుకుని మరో రికార్డు నెలకొల్పింది.
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం ఈ ఇద్దరి కెరీర్లో అతిపెద్ద హిట్గా నిలిచింది. మార్చి 30న విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి నాన్ బాహుబలి కేటగిరీలో ఈ మార్కును అందుకున్న తొలి టాలీవుడ్ బ్లాక్బస్టర్గా రికొత్త రికార్డును నమోదు చేసింది.
ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ కావడానికి ప్రధాన కారణాలు రొటీన్ తెలుగు సినిమాలకు భిన్నంగా పల్లెటూరి నేపథ్యంతో సుకుమార్ రాసుకున్న స్క్రిప్ట్, చిట్టి బాబు పాత్రలో రామ్ చరణ్, రామలక్ష్మి పాత్రలో సమంత, ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబు, రంగమ్మత్త పాత్రలో అనసూయ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అని చెప్పక తప్పదు.
మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రంతో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుని హాట్రిక్ కొట్టారు. తొలుత 'శ్రీమంతుడు', ఆ తర్వాత 'జనతా గ్యారేజ్', తాజాగా 'రంగస్థలం' ఇలా ఒకదాన్ని మించి మరో హిట్ కొడుతూ తమ బేనర్ ప్రతిష్టను మరింతగా పెంచుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించబోయే తర్వాతి సినిమాను కూడా మైత్రి మూవీస్ వారే నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు హీరోగా నటించబోతున్నారు.