Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లాభాల పంట: బడ్జెట్ 31 కోట్లు, కలెక్షన్స్ 150 కోట్లు
హైదరాబాద్: మాధవన్, కంగనా రనౌత్ జంటగా ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 31 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 145 కోట్లు వసూలు చేసింది. త్వరలో ఈ చిత్రం 150 కోట్ల వసూళ్లను అందుకోబోతోంది.
సినిమాకు ఈ రేంజిలో కలెక్షన్లు రావడం చూసి అటు నిర్మాత క్రిషిక్ లుల్లా సైతం ఆశ్చర్య పడుతున్నారు. త్వరలోనే మా చిత్రం ‘దబాంగ్-2' 158 కోట్ల రికార్డును అందుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేసారు. ఇప్పటి వరకు ఈ చిత్రం సాధించిన కలెక్షన్ల వివరాల ప్రకారం.... బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన 12వ చిత్రం ‘తను వెడ్స్ మను రిటర్న్స్' రికార్డులకెక్కింది.
రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. గతంలో మాధవన్ నటించిన ‘తను వెడ్స్ మను' చిత్రం మంచి విజయం సాధించింది. దీనికి సీక్వెల్ గా తాజాగా ‘తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలై ఇప్పటికే బాక్సాఫీసు వద్ద 4 వారాలు పూర్తయింది. ఈ చిత్రం సాధించిన లాభాల శాతం 368%గా నమోదైంది.