Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టాలీవుడ్ ఆల్ టైం టాప్-5: ఎన్టీఆర్ దెబ్బకు పొజిషన్స్ మారాయి!
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో కలెక్షన్ల లెక్కలు ఎప్పుడూ ఆసక్తికరమే. తమ తమ హీరోల సినిమాలు అత్యధిక కలెక్షన్లతో టాప్ లిస్టులో ఉంటే అభిమానులకు హ్యాపీ ఫీలవుతారు. ఈ సంవత్సరం ఆరంభం నుండి చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఒక్క సినిమా కూడా టాప్-5 లిస్టులో చోటు దక్కించుకోలేదు.
ఈ సంవత్సరం టాప్-5 లిస్టును కదిపే సినిమా ఇక ఏదీ రాదేమో అని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్న తరుణంలో....'జనతా గ్యారేజ్' వచ్చింది. పలు సినిమాల రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఏకంగా టాప్-3 పొజిషన్ కి వచ్చేసింది.
ట్రేడ్ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం..... టాప్-5 సినిమాలకు సంబంధించిన షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.
బాహుబలి
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఎపిక్ ఫిల్మ్ బాహుబలి గతేడాది విడుదలై తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలం అన్ని బాషల్లో రిలీజై భారీ విజయం సాధించింది. ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి రూ. 600 కోట్ల పైచిలుకు గ్రాస్ సాధించింది. తెలుగు వెర్షన్ విషయానికొస్తే ఈ చిత్రం రూ. 180 కోట్ల షేర్ సాధించింది. మళ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టే సత్తా బాహుబలి-2కు మాత్రమే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
శ్రీమంతుడు
మహేష్ బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘శ్రీమంతుడు' మూవీ గతేడాది విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం 120 కోట్లకు పైగా గ్రాస్ సాధించగా.... రూ. 85 కోట్ల షేర్ వసూలు చేసింది.
జనతా గ్యారేజ్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలై తొలి మూడు వారాల్లో రూ. 110 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇప్పటి వరకు రూ. 76.5 కోట్ల షేర్ వచ్చింది. ఫుల్ రన్ లో ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.
అత్తారింటికి దారేది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రం 2013లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాహుబలి వచ్చే వరకు ఈ సినిమానే నెం.1 స్థానంలో కొనసాగింది. అప్పట్లో ఈచిత్రం దాదాపు రూ. 100 కోట్ల గ్రాస్..... 74.75 కోట్ల షేర్ సాధించింది.
మగధీర?, సరైనోడు?
2009లో విడుదలైన మగధీర షేర్ పరంగా ఇప్పటికీ టాప్-5లో చోటు దక్కించుకోవడం విశేషమే. అప్పట్లో ఈ చిత్రానికి దాదాపు రూ. 65 కోట్ల షేర్ వచ్చింది. అయితే ఆతర్వాత ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ విడుదల చేయగా మరో రూ. 8 కోట్ల షేర్ వచ్చిందని టాక్. మొత్తం దాదాపు రూ. 73 కోట్ల షేర్ వచ్చిందని అంటున్నారు. అయితే ఇటీవల విడుదలైన బన్నీ సరైనోడు మూవీకి కూడా 73 కోట్ల షేర్ సాధించిందని టాక్.