Don't Miss!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లు అర్జున్ అండతోనే ఎలక్షన్ టిక్కెట్
ఇక నిన్న సాయింత్రం అల్లు అర్జున్ హీరోగా రూపొందిన చిత్రం రేసు గుర్రం. శ్రుతిహాసన్ హీరోయిన్. సురేందర్రెడ్డి దర్శకుడు. తమన్ స్వరాలందించారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా||కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. తొలి సీడీని చిరంజీవి ఆవిష్కరించారు. దర్శకుడు వి.వి.వినాయక్ స్వీకరించారు. అల్లు అర్జున్ గురించి సమాచారాన్ని తెలిపే ఓ ఆప్ని కూడా ఇదే వేదికపై విడుదల చేశారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ''బన్నీ హీరో కావాలని కోరుకున్న మొదటి వ్యక్తిని నేను. 'డాడీ'చిత్రంలో డ్యాన్స్ వేసే కుర్రాడి పాత్ర కోసం అనుకుంటే అల్లు అర్జునే గుర్తొచ్చాడు. ఆ ఒకటిన్నర నిమిషం సన్ని వేశంతో ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం బన్నీకి ఉన్నాయి. అవే అతనికి మంచి ఫలితాల్నిస్తున్నాయి. సురేందర్ రెడ్డి తీసిన 'కిక్' సినిమాని ఇటీవలే టీవీలో చూశాను. చాలా నచ్చింది. ఆ సమయంలో నేను రవితేజలా ఉండుంటే ఆ సినిమాని నేనే చేసేవాడినేమో అనిపించింది. చాలా మంచి దర్శకుడు సురేందర్రెడ్డి'' అన్నారు. చిత్ర పరిశ్రమలో నిర్మాతల పరిస్థితి గురించి చిరంజీవి మాట్లాడుతూ ''నిర్మాత లేకపోతే సినిమానే లేదు. ప్రతి ఒక్కరూ నిర్మాత బాగోగులు చూసి నడుచుకోవాలి. నిర్మాతకు విలువనిచ్చినప్పుడే పరిశ్రమ నిలబడుతుంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు కలిసి చేసిన ఈ చిత్రం మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా'' అన్నారు.