Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హాట్ టాపిక్ : 'రేసు గుర్రం' కథ లీకైంది
హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై మంచి అంచనాలే ఉన్నాయి.ఇక ఈ చిత్రం కథ లీకైందంటూ తాజాగా ఓ కథ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలోకి వచ్చింది.
ఆ కథ ప్రకారం... సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ తిరిగే అల్లు అర్జున్ కి ఓ అన్నయ్య ఉంటాడు. అతను ఓ టప్ పోలీస్ ఆఫీసర్..కిక్ శ్యామ్. ఇద్దరికి ఎప్పుడూ పడదు..ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు. ఈ లోగా..శ్యామ్... ఓ అవినీతి మినిస్టర్ కి చెందిన ఇల్లీగల్ ఏక్టివిటీస్ పట్టుకుని అరెస్టు చేయటానికి రెడీ అవుతాడు. అయితే అతన్ని పట్టిచ్చే డాక్యుమెంట్స్ మిస్ అవుతాయి. వాటి మీద తన తమ్ముడు అల్లు అర్జున్ ఫింగర్ ఫ్రింట్స్ ఉంటాయి. దాంతో తన తమ్ముడునే దోషిగా నిర్దారించి అరెస్ట్ చేయటానికి సిద్దపడతాడు. అలాంటి పరిస్ధితుల్లో అల్లు అర్జున్...తన నిర్ధోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు...తనని కేసులో ఇరికించిన విలన్స్ కి ఎలా బుద్ది చెప్పాడనేది మిగతా కథ. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు పూర్తి స్ధాయి కామెడీ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ కథ నిజమే అయితే మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నామన్నమాట.
ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.