Don't Miss!
- News Sri Rama Navami: రాముడికి నైవేద్యంగా పానకం, వడపప్పు స్పెషల్.. ఎందుకంటే!!
- Sports KKR vs RR: అందుకే తుది జట్టులో మార్పులు చేశాం: సంజూ శాంసన్
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Lifestyle రామసేతు ఇక ఎప్పటికీ మిస్టరీగానే ఉంటుందా.. శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే..!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
హ్యాపీ న్యూస్: సీక్వెల్ కు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ అభిమానులకు మాత్రమే కాదు...సినీ అభిమానులకు సైతం ఇష్టమైన చిత్రం 'ఆదిత్య 369'. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య ఈ విషయమై వార్తలు సైతం వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
గత కొద్ది రోజులుగా....ఈ కథని బాలకృష్ణ కొనసాగించడంపై దృష్టిసారించారు. కానీ ఎందుకో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడందుకు ముహూర్తం కుదిరిందని సమాచారం. 'ఆదిత్య 369'కి కొనసాగింపుగా 'ఆదిత్య 999' కథ పూర్తిస్థాయిలో సిద్ధమైందని సమాచారం. ఈ చిత్రంలో నటించడానికి బాలకృష్ణ ఉత్సాహంగా ఉన్నారని చెప్తున్నారు.
ఇటీవల సింగీతం శ్రీనివాసరావు బాలకృష్ణకు ఆ కథ వినిపించారని, బాలకృష్ణ ఆమోద ముద్ర వేశారని తెలుస్తోంది. ప్రస్తుతం 'డిక్టేటర్'తో బిజీగా ఉన్నారు బాలకృష్ణ. ఆ తరవాత వందో చిత్రం ఉంటుంది. 101వ చిత్రంగా 'ఆదిత్య 999' పట్టాలెక్కే అవకాశాలున్నాయి.
'ఆదిత్య 369' లో ఈ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్ని చూపించేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి తీసుకెళ్లారు. రూ.1500 పెట్టి కిలో టమోటాలు కొనుక్కొనే భయంకరమైన భవిష్యత్తునూ కళ్లకు కట్టారు. మరి ఈ సారి సింగీతం గారు ఏం చూపనున్నారో...ఏం వెరెటైలు చేయనున్నారో చూడాల్సిందే.