Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నిజమా? బాలయ్య ‘మే’డే గిఫ్టు ఇస్తున్నారా?
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సత్య దేవ దర్శకత్వంలో ‘లయన్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ చిత్రం ఆడియో రిలీజ్ మార్చి 28 విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. అయితే ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు ఏప్రిల్ 9కి వాయిదా వేసినట్లు సమాచారం. శిల్పకళా వేదికలో ఆడియో వేడుక ఘనంగా జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైనట్లు చెబుతున్నారు. మే 1వ తేదీన కార్మిక దినోత్సవం సందర్భంగా సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది. ఈచిత్రం బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
బాలయ్య సరసన తొలిసారి త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత, దర్శకత్వం: సత్యదేవా.