బెల్లంకొండ తనయుడితో సుకుమార్ సినిమా?
హైదరాబాద్: 'అల్లుడు శీను' ట్రైలర్ విడుదలతో కొత్త హీరో సాయి శ్రీనివాస్ హాట్ టాపిక్గా మారాడు. ఈ ట్రైలర్లో సాయి శ్రీనివాస్ లుక్స్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకునే విధంగా ఉండటంతో పలువురి దర్శకుల దృష్టి అతనిపై పడింది. తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు సుకుమార్ సాయి శ్రీనివాస్తో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట.
ఈ సంవత్సరం ఆరంభంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన '1-నేనొక్కడినే' చిత్రం భారీ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. దాని తర్వాత సుకుమార్ ఏ సినిమాకూ కమిట్ కాలేదు. ఇపుడు తన వద్ద ఉన్న కథ ఒకటి సాయి శ్రీనివాస్కు సరిపోయే విధంగా ఉండటంతో అతనితో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట. అయితే ఈ విషయం అఫీషియల్గా ఖరారు కావాల్సి ఉంది.

సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్న 'అల్లుడు శీను' సినిమా విషయానికొస్తే....వివి వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈచిత్రంలో సమంత హీరోయిన్. కొడుకు సినిమా కావడంతో బెల్లంకొండ భారీగా ఖర్చు పెడుతున్నారు. టాప్ హీరోయిన్ సమంతకు ఈ చిత్రం కోసం భారీగానే రెమ్యూనరేషన్ ముట్టజెప్పినట్లు సమాచారం. దీంతో పాటు మరో స్టార్ హీరోయిన్ తమన్నాతో ఐటం సాంగు చేస్తున్నారు.
ఏ విషయంలోనూ రాజీ పడకుండా సినిమాను లావిష్గా తెరకెక్కించారు. వివి వినాయక్ దర్శకత్వం, సమంత, తమన్నా, బ్రహ్మానందం లాంటి స్టార్స్ ఉండటం....యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్గా ఈ చిత్రం ఉండబోతుండటంతో సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు యూనిట్ సభ్యులు.


Click it and Unblock the Notifications











