Don't Miss!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సంక్రాంతి పోటీలో బిగ్ ట్విస్ట్: అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ చేంజ్.. ఏకంగా రెండు రోజులు.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని పండుగ సీజన్లకు ప్రత్యేకమైన పోటీ ఉంటుంది. వాటిలో ముఖ్యంగా తెలుగు వారి పండుగ సంక్రాంతి గురించి వేరేగా చెప్పక్కర్లేదు. దీనికి కారణం ఆ సమయంలో పల్లెలతో పాటు పట్టణాలన్నీ కళకళలాడుతూ ఉంటాయి. అన్నింటికీ మించి వారం రోజుల పాటు సెలవులు ఉంటాయి. దీంతో తమ సినిమాలను విడుదల చేయాలని ప్రతి ఫిల్మ్ మేకర్ అనుకుంటాడు. గత సీజన్లలానే ఇప్పుడు కూడా భారీ చిత్రాలు విడుదల అవుతున్నాయి. అందులో మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు', బన్నీ 'అల.. వైకుంఠపురములో' మధ్య పోటీ ఉంటుందని అనుకుంటున్నారు. ఈ సమయంలో సంక్రాంతి పోటీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ మారింది. వివరాల్లోకి వెళితే...
అందరూ స్టార్లే అందుకే అంచనాలు
టాలీవుడ్లోని ఇద్దరు స్టార్ హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్ సంక్రాంతి బరిలో నిలిచారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు'తో మహేశ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ‘అల.. వైకుంఠపురములో' ద్వారా బన్నీ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. క్రేజీ కాంబినేషన్లు కావడంతో ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు ఉన్నాయి.
మహేశ్ సరికొత్తవి ట్రై చేస్తున్నాడు
‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి హిట్ల తర్వాత మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు'తో వస్తున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో విజయశాంతి, బండ్ల గణేష్, ప్రకాశ్ రాజ్, సంగీత కీలక పాత్రలు చేశారు. ఇది కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ చేయాలన్న కసితో ఉన్న సూపర్ స్టార్.. అందుకోసం ఎన్నో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు.
అల్లు అర్జున్ నమ్మకం మాత్రం ఇదే
‘నా పేరు సూర్య' పరాజయం తర్వాత అల్లు అర్జున్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘అల.. వైకుంఠపురములో' చేశాడు. పూజా హెగ్డే కథానాయికగా చేస్తున్న ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని బన్నీ నమ్మకంతో ఉన్నాడట.
అందులో మాత్రం ఒక దానిని మించి మరొకటి
విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో రెండు సినిమాలు యూనిట్లు ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేశాయి. ఇందులో భాగంగానే కొద్ది రోజుల నుంచి టీజర్లు, పాటలు విడుదల చేస్తున్నాయి. ఈ రెండు మూవీల నుంచి వస్తున్న ప్రతి దానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఒక దానిని మించి మరొకటి రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ చేంజ్
పది రోజుల్లో ఈ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ నటిస్తున్న ‘అల.. వైకుంఠపురములో' రిలీజ్ డేట్ మారిందట. వాస్తవానికి ఈ సినిమాను జనవరి 12న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, తాజాగా దానికి జనవరి 10 మార్చుతున్నారని ప్రచారం జరుగుతోంది.
‘అల' టీమ్ నిర్ణయానికి కారణం ఇదేనట
సినిమా రిలీజ్ డేట్ను రెండు రోజులు ముందుకు జరపడానికి కారణం.. ఓపెనింగ్స్ అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒకరోజు ముందు వస్తున్న ‘సరిలేరు'కు ఆ విషయంలో అడ్వాంటేజ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ‘అల' టీమ్ ముందుకు వచ్చిందని తెలుస్తోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ న్యూస్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.