Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవి మందలింపు, అందుకే అల్లు అర్జున్ ఇలా?
హైదరాబాద్: పవన్ ఫ్యాన్స్ విషయమై జరుగుతున్న వివాదానికి అల్లు అర్జున్ ..ఒక మనస్సు ఆడియో ఫంక్షన్ లో ఫుల్ స్టాఫ్ పెట్టడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ స్టేజిపై మాట్లాడటానికి కారణం చిరంజీవి చెప్పిన జాగ్రత్తలు, సూచనలే కారణం అని మీడియాలో బలంగా వినిపిస్తోంది.
అభిమానులు అనేవారు..ఏ ఆర్టిస్టు కైనా చాలా ముఖ్యమనే విషయాన్ని చిరంజీవి..స్వయంగా అల్లు అర్జున్ కు బ్రీఫ్ చేసి, వారు లేకపోతే మనం లేమంటూ హెచ్చరించారని, అందుకే ఈ వివాదానికి ఫుల్ స్టాఫ్ పెట్టాలని బన్ని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.
ఓ లీడింగ్ ఇంగ్లీష్ పేపరు కథనం ప్రకారం... చిరంజీవి..బుధవారం అల్లు అర్జున్ ని పిలిచి చాలా సేపు మాట్లాడారట. ఓపిక పట్టాలని, చాలా విషయాల్లో సహనంతో ఉండాలని చెప్పారని హిత భోధ చేసారట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి నీకేంటి ప్లాబ్లం అంటూ మందలించారట.
అంతేకాకుండా నేను నీ బిహేవిరయర్ గురించి మొన్న వైజాగ్ లో మాట్లాడాను, ఎంతో మెచ్యూరిటీ వచ్చిందని పొగిడాను. ఇంతలోనే ఈ వివాదం లో ఇరుక్కున్నావేంటి అంటూ బాధగా అల్లు అర్జున్ తో అన్నారట. దాంతో నీహారిక చిత్రం ఒక మనస్సు ఆడియో పంక్షన్ లో...క్లారిటీతో మాట్లాడి, ఫుల్ స్టాఫ్ పెట్టాడని చెప్తున్నారు.