Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'రామయ్యా వస్తావయ్యా' ఆడియోకి ఫ్యాన్స్ కి నో??
హైదరాబాద్: ఎన్టీఆర్ కూడా దసరా సంబరాలను మరింత పెంచడానికి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియో ఈ వారంలోనే వస్తుందని దిల్ రాజు ఖరారు చేసారు. ఈ నేపధ్యంలో ఈ ఆడియోకు ఫ్యాన్స్ హంగామా ఉంటుందా ఉండదా అనేది క్వచ్చిన్ మార్క్ గా మారింది. ఎందుకంటే బాద్షా ఆడియో సమంయంలో జరిగిన విషాదం అందరికి గుర్తుకు వస్తోంది. అయితే దిల్ రాజు ..నందమూరి అభిమానుల సమక్షంలోనే విడుదల చేస్తాం అంటున్నారు. అంటే ప్రత్యేకమైన జాగ్రత్తలతో కూడిన ఏర్పాట్లు చేస్తున్నారా అంటున్నారు.
ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' ఆడియో వేడుకల్లో ఆపశృతి చోటు చేసుకుంది. మణికొండలోని రామానాయుడు స్టూడియోలో ఈ వేడుకలు ఏర్పాటయ్యాయి. ఈ వేడులకు జూ. ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో వరంగల్లోని ఉరుసుగుట్టకు చెందిన రాజు అనే అభిమాని ఊపిరి ఆడక మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. మృతదేహాన్ని కొండాపూర్ ఆస్పత్రిలో ఉంచారు. దాంతో అది రాష్ట్రంలో వివాదాంశంగా మారింది.
'బాద్ షా' ఆడియో వేడుకల్లో తొక్కిసలాట జరిగి, అభిమాని మృతి చెందడంతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేనిది ఈసారి ఇలా ఎందుకు జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో వరంగల్ జిల్లాకు చెందిన రాజు అనే అభిమాని మృతి చెందడంతో తోటి అభిమానులు ఆయన మృతికి సంతాపంగా రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. దీంతో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంఆడియో పంక్షన్ ని ఎలా ప్లాన్ చేస్తారు...ప్యాన్స్ కు ఆహ్వానం ఉందా లేదా అనేది అందరిలో ఆసక్తికరమైన చర్చగా మారింది.
నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ ''మా సంస్థకు అక్టోబరు నెల కలిసొచ్చింది. కొత్తబంగారులోకం, బృందావనం సినిమాలు ఈ నెలలోనే విడుదల చేశాం. ఇప్పుడు 'రామయ్యా...' కూడా వచ్చేస్తున్నాడు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ వారంలోనే పాటల్ని నందమూరి అభిమానుల సమక్షంలో విడుదల చేస్తున్నాము '' అన్నారు. సమంత హీరోయిన్. శ్రుతిహాసన్ కీలక పాత్రధారి. తమన్ స్వరాలు అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేయనున్నారు.