Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 3 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయశాంతి వల్ల ‘సరిలేరు’ ఆలస్యం.. ఆమెకే ఎక్కువ టైమ్ కేటాయించాల్సిన పరిస్థితి.!
సంక్రాంతి కానుకుగా రాబోతున్న చిత్రాల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' ఒకటి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికితోడు, ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పాటల వల్ల అవన్నీ రెట్టింపు అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం చాలా బాకీ పడిపోయిందట. ఈ నేపథ్యంలో సినిమాలో నటిస్తున్న లేడీ అమితాబ్ విజయశాంతి గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.? పూర్తి వివరాల్లోకి వెళితే..

గుమ్మడికాయ కొట్టారు.. అవి స్టార్ట్ చేశారు
ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. దీనికి సంబంధించిన ప్రకటనను కూడా చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. అయితే, నటీనటుల డబ్బింగ్, కొన్ని గ్రాఫిక్ వర్క్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి అవే పనులతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రష్మిక తన డబ్బింగ్ను కూడా పూర్తి చేసింది.

చిరు రాకతో ఉత్సాహం పెరిగిపోయింది
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న నిర్వహిస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ ఫంక్షన్కు చిరు హాజరు కాబోతుండడం చిత్ర యూనిట్తో పాటు ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని పెంచింది.

పట్టుబట్టి మరీ తీసుకొచ్చిన డైరెక్టర్
సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. 2006లో వచ్చిన ‘నాయుడమ్మ' సినిమా తర్వాత ఆమె రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ సినిమాల్లోకి రాలేదు. కానీ, దర్శకుడు అనిల్ రావిపూడి పట్టుబట్టి మరీ ఆమెను ఈ సినిమాలో నటించేలా ఒప్పించారు.

విజయశాంతి స్పెషల్ అట్రాక్షన్
చాలా కాలం తర్వాత సినిమాల్లోకి వచ్చిన విజయశాంతి లుక్ ఈ సినిమాలో ఎంతో హుందాగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్లో ఆమె కనిపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అలాగే, ఈ సినిమా కోసం సీనియర్ నటి సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. దీంతో ఆమె ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు.

విజయశాంతి వల్ల ‘సరిలేరు' ఆలస్యం
ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఇందులో విజయశాంతిని యంగ్గా చూపించేందుకు కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడుతున్నారట. ఈ పనుల వల్ల సరిలేరు పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో చిత్ర యూనిట్ టెన్షన్ పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.