త్రిష బ్రేకప్ : లక్ష్మి రాయ్ హ్యాపీగా పార్టీ చేసుకుందట!
హైదరాబాద్: హీరోయిన్ త్రిష ...తమిళ వ్యాపార వేత్త వరుణ్ మణియన్ తో ప్రేమలో పడటం, అతనితో నిశ్చితార్థం కూడా జరుపుకోవడం తెలిసిందే. ఏమైందో తెలియదు కానీ.....త్రిష-వరుణ్ మధ్య గొడవలొచ్చాయి. ఇద్దరూ తమ నిశ్చితార్థం కూడా రద్దు చేసకున్నారు. అయితే త్రిష నిశ్చితార్థం రద్దయినప్పటి నుండి ఓ విషయం తమిళ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

హీరోయిన్ లక్ష్మి రాయ్ ప్రేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వీళ్ల పెళ్లి పెటాకులు అయిందని తెలియగానే అమ్మడు పార్టీ చేసకుందట. తన స్నేహితులతో కలిసి త్రిష బ్రేకప్ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుందట. అంతే కాదు ఈ పెళ్లి జరగదని నేను ఆ రోజే చెప్పానని ఒకటికి పది సార్లు చెబుతూ తెగ సంబర పడిందట.
ఒకప్పుడు వరుణ్, లక్ష్మిరాయ్ డేటింగ్ చేసారని,....అయితే త్రిష పరిచయం అయిన తర్వాత వరుణ్ ఆమెకు దూరం అయ్యాడని అంటున్నారు. త్రిష, వరుణ్ మణియన్ విడిపోవడంతో లక్ష్మిరాయ్ చాలా సంతోషంగా ఉందని తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











