twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ ని తీసేసి మహేష్‌ తో చిత్రం ఖరారు?

    By Srikanya
    |

    హైదరాబాద్ : తమిళ దర్శకులంతా మహేష్ బాబు తో చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. మొన్నటివరకూ విష్ణు వర్దన్,లింగు స్వామి కథలు పుచ్చుకుని మహేష్ వెనక పడగా తాజాగా ఆ లిస్ట్ లో మరొకరు చేరారు. ఆయనే నాగచైతన్యకు స్టార్ డమ్ తెచ్చిన గౌతమ్ మీనన్. నిజానికి మహేష్ సోదరి మంజుల నిర్మించిన ఏ మాయ చేసావే టైమ్ లోనే గౌతమ్ మీనన్,మహేష్ కాంబినేషన్ చిత్రం వస్తుందని అంతా భావించారు. అయితే ఆ తర్వాత మంజుల మొదట అనుకున్న రెమ్యునేషన్ ఎగ్గొట్టిందని,ఇచ్చిన అడ్వాన్స్ కూడా వెనక్కి ఇవ్వాలని గొడవ పెట్టిందని, ఎధిక్స్ లేనివాళ్లతో పనిచేయటం కష్టమని గౌతమ్ మీనన్ బాలీవుడ్ మీడియా వద్ద మండిపడ్డారు.

    దాంతో ఇక మహేష్,గౌతమ్ మీనన్ చిత్రం లేనట్లే అని అంతా అనుకున్నారు. అయితే ఆయన తను విజయ్ తో ప్లాన్ చేసిన చిత్రానికి మహేష్ అయితే కరెక్టుగా సరిపోతాడని బావించి మహేష్ ని ఎప్రోచ్ అవుతున్నాడని కోలివుడ్ వర్గాలు అంటున్నాయి. విజయ్ కు నేరేట్ చేసిన యోహాన్ అధ్యాయం ఒండ్రు కథ నచ్చలేదని,పూర్తిగా హాలీవుడ్ స్టైల్లో ఉందని,తన అబిమానులు కనెక్టు కారని మార్పులు కోరాడట. అయితే గౌతమ్ కి హీరో మార్పులు చెప్పటం నచ్చలేదు. దాంతో మహేష్ తో తమిళ,తెలుగు భాషల్లో చేసి అక్కడి వారికి బుద్ది చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు తమిళ మీడియా అంటోంది.

    ప్రస్తుతం మహేష్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చొంది. సుకుమార్ దర్శకత్వంలోనూ ఓ చిత్రం విడుదల అవుతోంది. 14 రీల్స్‌ సంస్థ ఈ చిత్రం నిర్మిస్తోంది. ఇందులో ఆయన ఆధునిక శైలిలో కనిపించబోతున్నట్లు సమాచారం. మారుతున్న ఫ్యాషన్స్‌కి అద్దంపట్టేలా మహేష్‌ రూపురేఖలు ఉంటాయని తెలిసింది. ఇప్పటి వరకూ ఆయన్ని చూడని కోణంలో కనిపిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో చిత్ర కథానాయకుడితోపాటు, దర్శకుడు సుకుమార్‌ కూడా ప్రత్యేక దృష్టిపెట్టారు.

    మరో ప్రక్క పవన్ తో చేసిన 'గబ్బర్ సింగ్' చేసిన బండ్ల గణేష్ తన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ తో చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ తో రీసెంట్ గా ఆయన చిత్రం కమిటయ్యారని సమాచారం. పూరీ జగన్నాధ్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం స్క్రిప్టు రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. 2013 వేసవి లో ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రం రేసీ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారని తెలుస్తోంది.

    English summary
    Ace director Gautham Menon was supposed to start his long waited Yohan: Adhayayam Ondru with Ilayathalapathy Vijay in the lead, but now we hear that the director is planning to rope in Tollywood superstar Mahesh Babu in Yohan to be made in Tamil, Telugu and Hindi.
 
 According to sources, Vijay opined that the script looks similar to the lines of James Bond series and wanted some changes to suit the local audiences. But Gautham Menon wanted to keep the same script and approached Mahesh to do the film.
 
 Meanwhile, Gautham Menon is currently busy with his upcoming bilingual Yeto Vellipoindi Manasu (Neethane En Ponvasantham in Tamil). The Tamil version of the flm has Jiiva and Samantha, while Nani plays the male lead in the Telugu version.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X