Don't Miss!
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'1 నెనొక్కడినే' లో ఇంటర్వెల్ ట్విస్ట్ అదా..?
హైదరాబాద్ : మహేష్ బాబు '1 నెనొక్కడినే' సినిమా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'దూకుడు' చిత్రం తరువాత మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. సంస్థ సుకుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న '1' నేనొక్కడినే.. చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్టోరీ పై రకరకాల కథలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ట్విస్ట్ సినిమాకు ప్రాణమై నిలుస్తుందని చెప్పుకుంటున్నారు అదేమిటంటే...
ఈ చిత్రంలో మహేష్ బాబు...ఫస్టాఫ్ అంతా ఇద్దరిగా కనపడతాడు. ఒకటి పాప్ సింగర్ గా...మరొకటి..రివేంజ్ తీర్చుకునే కుర్రాడిగా... ఇంటర్వెల్ దగ్గరకి వచ్చేసరికి వీళ్లద్దరూ వేరు వేరు కాదు...ఒకరే అని తెలుస్తుంది. అదే ఈ సినిమాలో మేజర్ ట్విస్ట్ అని చెప్పుకుంటున్నారు. హూ ఆర్ యూ అనే పాట కూడా ఈ ట్విస్ట్ ని బేస్ చేసుకున్న పాటే అంటున్నారు. ఈ ట్విస్ట్ ..పాటని దృష్టిలో పెట్టుకుని అల్లేసిన కహానీనా లేక నిజమా అని తేలాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వేచి ఉండాల్సిందే.
మహేష్ బాబు మాట్లాడుతూ... '' ఈసారీ పండగ '1'తో మొదలవబోతోంది. అభిమానులు సిద్ధంగా ఉండండి. థియేటర్ల దగ్గర పండగ చేసుకొందాం. 2013ని మర్చిపోలేను. గత రెండేళ్ల నుంచీ సంక్రాంతికి నా సినిమాలొస్తున్నాయి. 'బిజినెస్మేన్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించారు.2014లో కనీసం రెండు సినిమాలైనా సిద్ధం చేయాలన్నది నా ఆలోచన. కొత్త యేడాది సంబరాలు ఇంటి దగ్గరే చేసుకొంటా'' అన్నారు .
రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా గురించి వారు వివరిస్తూ - 'ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ముందు ప్రకటించిన విధంగానే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 10న విడుదల చేస్తాం' అన్నారు. 'ఆడియో పెద్ద హిట్ అయింది.
దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మహేశ్ తనయుడు గౌతమ్ చిన్నప్పటి మహేశ్గా నటించడం ఈ చిత్రానికి ఒక హైలైట్ పాయింట్. మా బేనర్లో ఇది మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది' వారన్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సుకుమార్.