ఒకే వేదిక పైకి బాలకృష్ణ-చిరంజీవి.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారుగా!
మొట్టమొదటి తెలుగు ఓటీటీ అయిన ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కేవలం సినిమాలు వెబ్ సిరీస్లకే పరిమితం కాకుండా మొదటి నుంచి సరికొత్త షోలతో ఆడియన్స్ ను అలరిస్తూ వస్తోంది. ఈ ఓటీటీలో మిగతా అన్ని ప్రోగ్రామ్స్ కంటే 'అన్ స్టాపబుల్' షో పెద్ద హిట్ అయింది. తొలిసారి బాలయ్యలో మరో కోణాన్ని ఆవిష్కరించిన ఈ షో సూపర్ హిట్ అయింది. బాలకృష్ణ హోస్ట్ చేసిన షో అవడంతో విపరీతమైన బజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఇప్పుడు రెండో సీజన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఏకంగా మెగాస్టార్ ఎంట్రీ ఉండబోతుందని అంటున్నారు. ఆ వివరాలు

సాధ్యపడలేదు
కోపిష్టి అని ముద్ర పడిన బాలకృష్ణలోని మరో కోణాన్ని పరిచయం చేసింది 'అన్ స్టాపబుల్'. బాలకృష్ణ లాంటి సూపర్ క్రేజ్ ఉన్న ఒక హీరో స్టార్స్ ను ఇంటర్వ్యూ చేయడంతో ఈ షో కి భారీ పాపులారిటీ వచ్చింది. ఈ ఒక్క షో చూడడానికి సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారు చాలా మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నిజానికి మొదటి సీజన్ లో చిరంజీవిని గెస్ట్ గా తీసుకు రావాలనుకున్నారు కానీ అది ఎందుకో సాధ్యపడలేదు.

మరింత బజ్
నిజానికి అల్లు అరవింద్.. చిరంజీవి వచ్చే విషయంలో కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నా వేరే కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో బాలయ్య షోకి రాలేకపోయారు. అయితే త్వరలోనే మొదలు పెట్టనున్న 'అన్ స్టాపబుల్' సీజన్ 2కి మాత్రం మొదటి గెస్ట్ గా చిరు పక్కా వస్తారని ప్రచారం జరుగుతోంది. మొదటి ఎపిసోడ్ కి చిరుని గెస్ట్ గా తీసుకొస్తే మరింత బజ్ వస్తుందని తద్వారా రెండో సీజన్ కు భారీ బూస్ట్ అవుతుందని ఆహా టీమ్ భావిస్తోంది.

గొడవ జరిగిందని
చిరు తరువాత వెంకటేష్, నాగార్జున కూడా ఈ సీజన్ లో కనిపిస్తారు అని అంటున్నారు. బాలకృష్ణకు-చిరంజీవికి మాధ్య ఏవో ఇబ్బందులు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ అదేమీ లేదని వారి సన్నిహితులు చెబుతూనే ఉంటారు. ఇప్పుడు కనుక కలిసి షో చేస్తే ఆ పుకార్లకు బ్రేకులు వేసినట్టు అవుతుంది. ఇక బాలయ్యకి నాగార్జునకి కూడా అప్పట్లో గొడవ జరిగిందని ప్రచారం జరిగింది.

బిజీబిజీగా
ఆ తరువాత వీరిద్దరూ ఓ ఈవెంట్ కలిసి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు బాలయ్య షోలో నాగ్ కనిపిస్తే.. ఆ ఎపిసోడ్ కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి 'అన్ స్టాపబుల్' సీజన్ 2 మొదలుకానుందని అంచనా. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.

వరుస సినిమాలతో
ఇప్పటికే ఆయన మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్, మోహన్ రాజా డైరెక్షన్లో గాడ్ ఫాదర్, బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నారు. అలాగే వెంకీ కుడుముల డైరెక్షన్లో కూడా ఆయన ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా విషయమ్లో కొంత అనుమానాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











