Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
టాక్ ఆఫ్ ది టౌన్: సరిలేరు ఫంక్షన్కు చిరంజీవి రావడానికి కారణం ఎన్టీఆర్ డైరెక్టరే.!
సూపర్ స్టార్ మహేశ్ బాబు మాంచి జోష్ మీద ఉన్నాడు. ఆయన నటించిన గత రెండు చిత్రాలు సూపర్ హిట్ అవడంతో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. వాటిని అందుకునేందుకు చిత్ర యూనిట్ ఎంతో పట్టుదలతో పని చేస్తోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు మెగాస్టార్ చిరంజీవి సాయం తీసుకున్నారు. ఆయన ఇటీవల జరిగిన ఫంక్షన్కు హాజరవడంతో చిత్ర యూనిట్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇంతకీ ఆయన ఈ ఫంక్షన్కు రావడానికి కారణం ఎవరో తెలుసా.?
సరిలేరు నీకెవ్వరు వెనుక ఉన్నది వీళ్లే
అనిల్ రావిపూడి - మహేశ్ బాబు కలయికలో వస్తున్న చిత్రమే ‘సరిలేరు నీకెవ్వరు'. అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేశ్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోండగా, లేడీ అమితాబ్ విజయశాంతి, బండ్ల గణేష్, సంగీత, హరితేజ, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఒక్కటి కాదు.. అన్నింటికీ భారీ రెస్పాన్స్
ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఎన్నో అప్డేట్స్ ఇస్తోంది సరిలేరు నీకెవ్వరు యూనిట్. ఇప్పటి వరకు ఈ సినిమాలోని పాటలతో పాటు, టీజర్, ట్రైలర్ విడుదలయ్యాయి. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని కొన్ని పాటలైతే రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఆ రెండింటి మిశ్రమమే సరిలేరు నీకెవ్వరు
ఈ మధ్య సీరియస్ మూవీస్ చేసిన మహేశ్.. ఈ సినిమాలో అదిరిపోయే కామెడీని పండించనున్నాడు. ఫస్టాఫ్ మొత్తం అదే తరహాగా సినిమా సాగనుంది. ఇక, రెండో భాగంలో సీరియస్ మోడ్లోకి వెళ్తోందట. ఈ రెండింటి కలయికతో సరిలేరు నీకెవ్వరు రూపొందిందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక, ఇటీవల విడుదలైన ట్రైలర్లో ఈ అంశాలు చూపించారు.
సరిలేరు యూనిట్లో కొత్త ఉత్సాహం
సంక్రాంతి కానుకగా రానున్న సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసేసింది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ఎంట్రీతో ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అవడంతో.. చిత్ర యూనిట్లో కొత్త ఉత్సాహం వచ్చినట్లైంది.
చిరు రావడానికి కారణం ఆయనే
సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి హాజరు కావడం వెనుక మహేశ్ బాబు సన్నిహితుడు, టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఉన్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. చిరంజీవికి దగ్గరి బంధువు అయిన ఆయన.. అందరి కంటే ముందుగా వెళ్లి ఫంక్షన్కు ఆహ్వానించారట. దీనికి ఆయన ఓకే చెప్పడంతో చిత్ర యూనిట్ మర్యాదపూర్వకంగా కలిసిందని సమాచారం.
నాలుగు సినిమాలు.. అన్నీ ఫ్లాప్లే
మెహర్ రమేశ్ తెలుగులో నాలుగు సినిమాలను తెరకెక్కించాడు. అందులో జూనియర్ ఎన్టీఆర్తోనే రెండు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. అప్పటి నుంచి దర్శకత్వానికి దూరంగా ఉంటున్న రమేశ్.. మహేశ్ బాబు కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఈ క్రమంలోనే పలు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్గానూ వ్యవహరిస్తున్నాడు.