Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నితిన్ ఫాదర్ ఆవేశం? చార్మి మీద పరువు నష్టం కేసు!
హైదరాబాద్: పూరి జగన్నాథ్, నితిన్ సినిమా రద్దవడం..... వెంటనే పూరి జగన్నాథ్ నితిన్ ప్లేసులో వరుణ్ తేజ్తో సినిమా చేయాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. ఎందుకు ఇలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ ప్రాజెక్టులో చార్మి జోక్యం కారణంగానే పూరి-నితిన్ మూవీ రద్దయిందంటూ అంతలోనే గాసిప్స్ హల్ చల్ చేసాయి.
ఈ గాసిప్స్ విని ఆవేశ పడిన ఛార్మి.... ఆ సినిమా రద్దవడానికి కారణం నేను కాదు, ఫైనాన్షియల్ కారణాలే. నితిన్ ఆ సినిమా నర్మించాలనుకున్నాడు. కానీ ఉన్నడబ్బులన్నీ అఖిల్ సినిమా మీద పెట్టాడు. డబ్బుల్లేకనే ఈ సినిమా ఆయన చేయలేక పోయాడు అనే విధంగా స్టేట్మెంట్ ఇచ్చేంది. చార్మి స్టేట్మెంట్ అందరినీ ఆశ్చర్యాని గురి చేసింది. వెంటనే తాను టంగ్ స్లిప్ అయ్యాననే విషయం గమనించిన ఛార్మి.....రూమర్స్ విని పొరబడ్డాను, అలా మాట్లాడాను, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను అంటూ క్షమాపణ చెప్పేసింది ఛార్మి.
అయితే అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగి పోయింది. ఛార్మి కామెంట్స్ నితిన్ ఫ్యామిలీని బాగానే హర్ట్ చేసినట్లు సమాచారం. చార్మి క్షమాపణలు చెప్పినా, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డిలో ఆవేశం తగ్గలేదని అంటున్నారు. ఆయన చార్మిపై పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయినా ఇలాంటి వ్యవహారాలు సినిమా పరిశ్రమలో సర్వ సాధారణమే, ఈ మాత్రం దానికి చార్మిపై కేసు వేస్తారా? అనే వారూ లేక పోలేదు. పలువురు సినీ ప్రముఖులు సుధాకర్ రెడ్డిని కూల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట.