Don't Miss!
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ కొత్త చిత్రం “జై లవ కుశ ” కథ ...ఆ సినిమానుంచి లేపారా ?
ఎన్టీఆర్ కొత్త చిత్రం కథ ని కాపి కొట్టారంటూ రూమర్స్ మొదలయ్యాయి.
హైదరాబాద్: పెద్ద హీరో ప్రారంభం కాగానే ఆ సినిమాపై రకరకాల రూమర్స్ మీడియాలో మొదలవటం అత్యంత సాధారణ విషయం. ఇప్పుడు ఎన్టీఆర్, బాబి కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త చిత్రం "జై లవ కుశ " (ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు) పైన కూడా అలాంటి రూమర్సే బయిలు దేరాయి. ఈ చిత్రం ఓ తమిళ సినిమా ఆదారంగా రూపొందుతోందని వార్త.
ఇప్పటికే ఈ సినిమాలో తారక్ మూడు విభిన్న గెటప్స్ లో కనిపించబోతున్నాడని వార్త వచ్చింది. దాంతో ఈ సినిమా కథ తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమా ఆధారం గా తీసుకున్నారని చెప్పుకోవటం మొదలైంది. దాదాపు పదేళ్ల క్రితం అజిత్ నటించిన "వరలారు" అనే సినిమా లో అజిత్ మూడు విభిన్న పాత్రలతో అలరించాడు.ఇక ఈ సినిమా 2006 లోనే తమిళనాట భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా ఆధారంగా ఈ కథ అల్లారని ప్రచారం చేస్తున్నారు.
మరో ప్రక్క ఈ సినిమా కథ గురించి మరో ప్రచారం మొదలైంది. అదేమిటంటే...ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్విన్స్ గా కనిపిస్తాడట. మూడవ పాత్ర ఏమిటంటే .. ఆ రెండు పాత్రలకి తండ్రిగా వుంటుందట. అంటే .. తండ్రీకొడుకులుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపిస్తాడని అంటున్నారు. ఏదైమైనా ఈ మూడు పాత్రలు ఏమిటి వాటిల్లో ఎన్టీఆర్ ఎలా అలరిస్తాడో చూడాలంటున్నారు అభిమానులు.
ఇప్పటికే టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలతో వరుస హిట్లు కొట్టిన ఎన్టీఆర్ 'జై లవ కుశ' పేరుతో సినిమా చేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి రావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయం ఆసక్తికరంగా మారింది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈచిత్రానికి బాలీవుడ్లో 3 ఇడియట్స్, పికె, మోహంజోదారో లాంటి భారీ చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ సికె మురళీధరన్ పనిచేయబోతున్నారు. రవితేజ తో 'పవర్', పవన్ కళ్యాణ్ తో 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలను తరకెక్కించిన కెఎస్ రవీంద్ర ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.