Don't Miss!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ఎన్టీఆర్-సుకుమార్ చిత్రం ఎప్పటి నుంచి అంటే...
హైదరాబాద్ :ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు సుకుమార్ ఓ సినిమాని ఓకే అయిన సంగతి తెలిసిందే. 'అత్తారింటికి దారేది' నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2014 సమ్మర్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి రిలియన్స్ వారు కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహిస్తారు. గత మూడు చిత్రాలుగా బి.వియస్ ఎన్ ప్రసాద్ అశోశియేషన్ లో ఉన్న రిలియన్స్ వారు..ఈ సినిమాతో మళ్లీ తమ అశోశియేషన్ ని ఎక్సటెండ్ చేసారు.
ఇప్పటి వరకు యూత్, అండ్ కాలేజీ స్టోరీలతో సినిమాలను రూపొందించిన సుకుమార్....ఎన్టీఆర్తో చేసే సినిమాతో సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని, తెలుగులో ఇప్పటి వరకు రానటువంటి పూర్తి భిన్నమైన కాన్సెప్టును రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. సుకుమార్ చెప్పిన కథ వినగానే ఎన్టీఆర్ ఎగ్జయిట్ అయినట్లు సమాచారం. సుకుమార్ ప్రస్తుతం మహేశ్తో '1.. నేనొక్కడినే' చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తవగానే ఎన్టీఆర్ సినిమా మొదలు కానున్నది. ఇక ఈ చిత్రం ఊసరవెల్లితో నష్టపోయిన...నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కు ఎన్టీఆర్ కాంపన్ షేషన్ గా చేస్తున్న చిత్రంగా... ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 2013 వేసవికి 'బాద్షా'గా వచ్చారు. తర్వాత 'రామయ్యా వస్తావయ్యా' గా వచ్చి అలరించలేకపోయారు. ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్తో ఓ చిత్రం సెట్స్ ఉంది. సుకుమార్ ప్రస్తుతం మహేష్బాబుతో '1' చిత్రం ఫైనల్ టచ్ స్ లో ఉన్నారు. ఇవి పూర్తయ్యాకే ఈ కొత్త కాంబినేషన్ సెట్స్పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ చిత్రం ఖచ్చితంగా కొత్త తరహాలో యూత్ ని ఆకట్టుకునేలా ఉంటుందని చెప్తున్నారు.