Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
14 కోట్లు బడ్జెట్ తో పవన్ కళ్యాణ్ చిత్రమా?
అలాగే ఈ చిత్రంలో నదియా..వెంకటేష్ కి భార్యగా కనిపించనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ 22 రోజులు డేట్స్ ఇచ్చారని అంటున్నారు. ఏప్రియల్ నెల నుంచి షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఇప్పటివరకూ దర్శకుడు ఎవరనేది మాత్రం ఖరారు కాలేదు. మొదటి నుంచి అనుకుంటున్నట్లు డాలీ నే ఉంటాడా మరొకరు మారతారా అనేది చూడాల్సిందే.
అలాగే ఈ చిత్రానికి ఏం పేరు పెట్టే అవకాసముందే విషయమై మీడియాలో రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి 'ఓరి దేముడా'అనే టైటిల్ పెట్టే అవకాసముందని చెప్తున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయటానికి నిర్ణయించారని ఫిల్మ్ సర్కిల్సో లో వినిపిస్తోంది. పవన్ కల్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఇప్పటికి కుదిరింది.
బాలీవుడ్లో
ఘన
విజయం
సాధించిన
చిత్రం
'ఓ
మై
గాడ్'.
'మేన్
హూ
స్యూడ్
గాడ్'
అనే
ఆంగ్ల
చిత్రం
ఆధారంగా
తెరకెక్కిన
చిత్రమిది.
ఈ
రెండు
చిత్రాల్ని
స్ఫూర్తిగా
తీసుకొని..
సురేష్
ప్రొడక్షన్స్
సంస్థ
తెలుగులో
ఈ
చిత్రాన్ని
నిర్మిస్తోంది.
ఈ
సినిమాని
తెరకెక్కించనున్నారు.
ఇందులో
బాలీవుడ్
లో
అక్షయ్
కుమార్
చేసిన
శ్రీ
కృష్ణుని
పాత్రలో
పవన్
కళ్యాణ్,
పరేష్
రావల్
చేసిన
ఓ
సాధారణ
వ్యాపారి
పాత్రలో
వెంకటేష్
కనిపించనున్నారు.
డాలీ
ఈ
చిత్రం
డైరక్ట్
చేస్తారు.
కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు. వెంకటేష్ స్వయంగా పవన్ ని అడిగాడని అందుకే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు. పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్'. అక్షయ్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.
'ఓ మై గాడ్'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.