Don't Miss!
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పట్టపగలు...పవన్ కళ్యాణ్ 'పులి' ఆడియో పంక్షన్
సాధారణంగా ఆడియో పంక్షన్స్ రాత్రిళ్ళు జరుగుతూంటాయి. అయితే పవన్ కళ్యాణ్ 'కొమరం పులి' చిత్రం ఆడియో మాత్రం జులై 11ఉదయం జరగనుందని సమాచారం. ఎఆర్ రహమాన్ కి వేరే బిజీ షెడ్యూల్ ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. మొదట డైరక్ట్ గా మార్కెట్లోకి రిలీజ్ చేద్దామనుకున్నా సినిమాకు క్రేజ్ తేవాలనే ఉద్దేశ్శంతో మళ్ళీ ఆడియో పంక్షన్ చేయటానికి ప్రిపేర్ అవుతున్నారని వినపడుతోంది. అందుకు తగినట్లే శిల్ప కళా వేదికలో ఈ చిత్రం ఆడియోను సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా విడుదల చేసి, క్రేజ్ తీసుకురానున్నారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రైట్స్ ని సోనీ మ్యూజిక్ వారు భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నారు. అలాగే ఈ 'కొమరం పులి' చిత్రం ఆగస్టు 12న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. శింగనల రమేష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.జె.సూర్య సూర్య దర్శకత్వంలో రూపొందించారు. అలాగే పవన్ సరసన ఈ చిత్రంలో నిఖిషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది.