Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
పవన్ కళ్యాణ్-రత్నం మధ్య ఒప్పందం నిజమేనా?
హైదరాబాద్: పవర్ స్టార్ కళ్యాణ్ త్వరలో 'ఖుషి' చిత్ర నిర్మాత ఏ.ఎం.రత్నంతో కలిసి మరోసారి పని చేయబోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తాను కమిటైన ఎస్.జె సూర్య దర్శకత్వంల ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆయనకు డేట్స్ ఇచ్చేందుకు సిద్దమయినట్లు సమాచారం.
అజిత్ నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ 'వీరమ్' రీమేక్ రైట్స్ పొందడంలో పవన్ కళ్యాణ్ కు రత్నం చాలా పెద్ద హెల్పే చేసాడట. అందుకు ప్రతి ఫలంగానే పవన్ కళ్యాణ్ తన తర్వాతి సినిమా ఆయనతో చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఏ.ఎం.రత్నం పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా కూడా తమిళ రీమేకే అని అంటున్నారు. అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ 'వేదాలమ్' చిత్రాన్ని పవన్ తో రీమేక్ చేస్తే తెలుగులో మంచి సక్సెస్ అవుతుందని ఏ.ఎం.రత్నం భావిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరూ ఒక అండర్ స్టాండిగుకు వచ్చినట్లు టాక్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'వీరమ్' రీమేకే అని టాక్. అయితే స్టోరీని మక్కికి మక్కి దించకుండా మార్పులు చేసినట్లు చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగిన విధంగా డైలాగ్స్ రాసారట.
ఒకప్పుడు భారీ చిత్రాల నిర్మాతగా ఉన్న ఎ.ఎం.రత్నం తర్వాత కొన్ని సినిమాలు ప్లాపు కావడంతో చాలా నష్టపోయారు. దీంతో చాలా కాలం ఆయన సొనిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇటీవలే ఫైనాన్షియల్ గా కోలుకున్న ఆయన తమిళంలో మళ్లీ నిర్మాతగా రీఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.