Prabhas Adipurush: 35 వేల షోస్తో ఆది పురుష్ రిలీజ్ ప్లాన్!
దర్శక దిగ్గజం జక్కన్న తెరకెక్కించిన బాహుబాలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ స్థాయికి చేరుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. తెలుగు హీరోల్లో ఏ కథానాయకుడు చేరుకోని రేంజ్కు ఎదిగాడు. అనంతరం వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ సైతం రికార్డుల మోత మోగించింది. భారతీయ చలన చిత్రానికి ఉన్న సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. దీంతో ప్రభాస్ స్థానం ఆకాశాన్నింటింది. అయితే తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ ఘోరంగా పరాజయం పాలయ్యాయి. సాహోకు కలెక్షన్లు వచ్చిన ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక రాధేశ్యామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్, సినీ లోకం కన్ను ఆది పురుష్పైనే ఉంది.

తగ్గని క్రేజ్..
బాహుబలి మూవీ సిరీస్తో వరల్డ్వైడ్గా స్టార్డమ్ సంపాదించుకున్న ప్రభాస్కు సాహో, రాధేశ్యామ్తో పరాజయం పాలయ్యాడు. అయితే ప్రభాస్కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రెండు సినిమాలు ఫెయిల్ అయిన సరే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆది పురుష్ మూవీ వచ్చే ఏడాది రానున్న విషయం తెలిసిందే.

సంక్రాంతి కానుకగా..
ఇవి కాకుండా ప్రాజెక్ట్ కె, సలార్ వంటి పెద్ద సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్నాడు డార్లింగ్. ఇక ఇప్పుడు తాజాగా ఆది పురుష్ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆది పురుష్ను విడుదల చేస్తున్నట్లుగా ఇదివరకే మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

9500 స్క్రీన్స్..
అయితే ఈ ఆది పురుష్ మూవీని వీలైనన్నీ ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇండియా మొత్తం మీద థియేటర్లు, స్క్రీన్స్ అన్నింటిని కలుపుకుని సుమారు 9500 ఉన్నాయని చెప్పాలి. అందులో ఆరున్నర వేలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు. మిగతావి మల్టీఫ్లెక్స్ స్క్రీన్లు. గతంలో పదివేలకు పైగ ఉన్నా.. కరోనా కారణంగా కొన్ని సింగిల్ స్క్రీన్లను గోడౌన్, షాపింగ్ కాంప్లెక్స్లుగా మార్చేశారు. ప్రస్తుతం ఉన్న వాటిలో వీలైనన్నీ స్క్రీన్లలో ఆది పురుష్ సినిమా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్.

35 వేల కంటే ఎక్కువగా..
ఒక్కో థియేటర్లో రోజుకు నాలుగు ఆటలు వేస్తారు. ఐదు షోలు వేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. అలా చూసుకుంటే రోజుకు 40 వేల షోలు వేయొచ్చు. వెయ్యి, 1500 థియేటర్లు వేరే సినిమాలకు ఇచ్చేసినా.. 8 వేల థియేటర్లలో ఆది పురుష్ విడుదల చేస్తే? కొన్ని థియేటర్లలో 4 షోలు, మరికొన్నింటిలో 5 షోలు వేస్తే.. రోజుకు సుమారు 35 వేల కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని టాలీవుడ్ ఇన్సైడ్ టాక్.

సరికొత్త రికార్డు..
దీంతో ప్రభాస్ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. అంతేకాకుండా ఈ రికార్డులను మరొకరు అందుకోవడం కూడా కష్టమే. ఇక సాహో, రాధేశ్యామ్కు ఆశించిన విజయం రాకపోవడంతో ఆది పురుష్ తో ప్రభాస్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తాడని ఆశిస్తున్నారు.

బీజేపీ అండ..
ఇక ఇదిలా ఉంటే ఆది పురుష్ మూవీ రాముడి కథతో రామాయణం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనన్ నటించనున్నారు. హిందూ సంస్కృతి, శ్రీరాముని గొప్పతనం గురించి వివరించే సినిమా కావడంతో పరోక్షంగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సహకారాలు ఉండవచ్చని అంచనా వేయవచ్చు. ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాలకు నార్త్లో ఆర్ఎస్ఎస్ నుంచి సహాయం లభించిందని టాక్. సో.. ఇలా శ్రీరామునిపై తీస్తున్న సినిమా ఆది పురుష్ కావడంతో మంచి సపోర్ట్ లభించవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











