Don't Miss!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరో టాప్ బాలీవుడ్ డైరెక్టర్తో ప్రభాస్.. బడ్జెట్ తెలుస్తే షాకే..
దేశవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్లానింగ్ మాత్రం అదిరిపోయేలా ఉంది. లాక్డౌన్ సమయం నుంచి సినిమా స్క్రిప్టులు వినడం, మూవీస్ ప్లాన్ చేసుకోవడం లాంటి విషయాలు బ్లాక్ బస్టర్ మాదిరిగా సాగిపోతున్నాయి.
ఇప్పటికే రాధేశ్యామ్ మూవీని రిలీజ్ సిద్ధం చేయగా.. సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ మొదలు పెట్టారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇలా భారీ ప్రాజెక్టులతో సిద్ధమైన బాలీవుడ్లో యంగ్ అండ్ టాప్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఓ వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్గా మారింది.
బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. ప్రభాస్ నటించబోయే సినిమాలో భారీ రేంజ్లో నటీనటులు, బడ్జెట్ వివరాలు హాట్ టాపిక్గా మారాయి. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందే చిత్రంలో సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి అని పేర్కొంటున్నారు. ఈ సినిమా బడ్టెట్ సుమారు రూ.250 కోట్లుగా పేర్కొంటున్నారు.
సిద్దార్థ్ ఆనంద్ కెరీర్ విషయానికి వస్తే.. సైఫ్ ఆలీ ఖాన్, రాణి ముఖర్జీ నటించిన హమ్ తుమ్ చిత్రంతో కెరీర్ ఆరంభించిన ఆయన సలామ్ నమస్తే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత రణ్బీర్ కపూర్తో బచ్నా ఏ హసినో, అంజానా అంజానీ రూపొందించారు. హాృతిక్ రోషన్తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు తెరకెక్కించారు. ప్రస్తుతం షారుక్ ఖాన్తో పఠాన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.