Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఇంకో రీమేక్ కోసం... రామ్ చరణ్ స్కెచ్?
హైదరాబాద్ : ఇప్పటికే తని ఒరువన్ రీమేక్ లో చేస్తున్న రామ్ చరణ్ ..తాజాగా మరో చిత్రం '49-ఒ' రీమేక్ రైట్స్ దక్కించుకున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. '49-ఒ' ఓ తమిళ చిత్రం...ఈ చిత్రంలో హీరోగా గౌండమణి చేసారు.చాలా కాలం గ్యాప్ తర్వార ఆయన రైతుల సమస్యలను బేస్ చేసుకుని ఈ సినిమా చేసారు. దర్శకుడు గౌతమ్ మీనన్ దగ్గర డైరక్షన్ డిపార్టమెంట్ లో చేసిన పి. ఆరోగ్యదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.
సినిమా అద్బుతం అనిపించకపోయినా...గ్యాప్ తర్వాత చేసిన గౌండమణి కోసం, సినిమాలో ఉన్న మ్యాటర్ కోసం చూడాల్సిందే అని తమిళ మీడియా రాసుకొచ్చింది. రీసెంట్ గా ఈ చిత్రాన్ని రామ్చరణ్ చూశారని అంటున్నారు. మీరు కూడా ఈ చిత్రం ట్రైలర్ ని ఇక్కడ చూడండి.
సినిమాలో కంటెంట్ కు కనెక్టు కావటంతో రీమేక్ హక్కులు కూడా చేజిక్కించుకున్నారని తమిళ సినీ వర్గాల టాక్. అయితే ఓ కమిడియన్ హీరోగా చేసిన సినిమాని రామ్చరణ్ మాత్రం ఏం చేసుకుంటాడు, ఇవన్నీ రూమర్సే అని కొందరు కొట్టిపారేస్తున్నారు. కత్తి సినిమా కూడా ఇలాంటి కథే కావటంతో ఈ సినిమాను రామ్ చరణ్ చేస్తాడని అనటంతో ఈ రూమర్స్ పుట్టాయంటున్నారు.
అయితే సొంత సంస్థ ఆరంభించి, ఆయన చిన్న సినిమాలు నిర్మించాలనుకుంటున్నారు కదా..అందుకోసం తీసుకున్నాడు అని మరికొందరు అంటున్నారు. ఇవన్నీ కాదు.... తన తండ్రి చిరంజీవి 150వ సినిమాకి ఆ కథ కొద్దిపాటి మార్పులు చేర్పులతో బాగుంటుందని కొన్నారని మరికొందరు వాదిస్తున్నారు. ఏది రూమరో, ఏది నిజమో తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.