Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
రామ్ గోపాల్ వర్మ-రాజ శేఖర్ చిత్రం టైటిల్
హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ మరో వరస ఫ్లాపుల హీరో రాజశేఖర్ తో చిత్రం చేస్తున్నాడు అనే సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన ఆల్రెడీ
చిత్రం షూటింగ్ పూర్తి చేసాడని తెలుస్తోంది. ఈ చిత్రం హర్రర్ జనర్ లో నడుస్తుందని,పట్టపగలు అనే టైటిల్ ఈ చిత్రానికి పెట్టారని అంటున్నారు. దీనికి రాజశేఖరే నిర్మాత
అని చెప్తున్నారు.
పట్టపగలు అనే టైటిల్ తో చిత్రం చేస్తానని వర్మ చాలా కాలంగా భయపెడ్తున్నారు. అది త్వరలోనే మన ముందుకు రానుందని తెలుస్తోంది. దాదాపు 15 రోజులు రెగ్యులర్
షూటింగ్ లో ఈ చిత్రం ఫినిష్ చేసాడని,త్వరలోనే విడుదల చేస్తున్నాడని వినికిడి. ఈ మేరకు ఎడిటింగ్ వర్క్ ప్రారంభమయ్యిందని అంటున్నారు. అయితే మీడియాకు ఈ
విషయం లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని మేనేజ్ చేసాడని,కొంతమంది మీడియా మిత్రలుకు తెలిసినా దాన్ని బయిటకు రానివ్వకుండా వర్మ రిక్వెస్ట్ చేసాడని
అంటున్నారు.
ఇరవై రోజుల క్రితమే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైందని తెలుస్తోంది. ఇద్దరూ ప్లాప్ లలో ఉన్నారు కాబట్టి హిట్ వచ్చే అవకాసం ఉందని అంటున్నారు. వర్మ పాయింట్
చెప్పిన వెంటనే థ్రిల్ అయిన రాజశేఖర్ డేట్స్ ని ఇవ్వటానికి ముందుకు వచ్చాడని వినికిడి. ఖాళీగా ఉన్న రాజశేకర్ కి ఈ చిత్రంతో బిజీ అవుతాడని అంటున్నారు. ఈ
చిత్రంలో కొద్దిగా పొలిటికల్ టచ్ కూడా ఉండే అవకాసం ఉందని అంటున్నారు.
మరో ప్రక్క రామ్ గోపాల్ వర్మ దర్శకుడుగా,మోహన్ బాబు నిర్మాతగా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రీసెంట్ గానే ప్రారంభమై, ఆ
మేరకు పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి 'ఒట్టు' అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్
గా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి సంబదించిన పూజా కార్యక్రమాలు ఫిల్మ్ నగర్లో జరిగాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 26 నుంచి మొదలు కానుంది.