Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘సాహో’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫ్యాన్స్కు రెండు పండుగలు
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'సాహో'. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్తో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదల కాబోతుంది.
వాస్తవానికి 'సాహో'ను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, ఊహించని విధంగా ఈ సినిమాను వాయిదా వేశారు. టెక్నికల్ కారణాలతో పాటు రీ రికార్డింగ్ వల్ల సినిమాను 15 రోజులు వాయిదా వేశారు. అంటే.. ఆగస్టు 30న 'సాహో' విడుదల కాబోతుంది.
ఈ సినిమా విడుదల విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా ఆలస్యం అవడంతో వారంతా చిత్ర యూనిట్పై కోపంగా ఉన్నారు. దీంతో 'సాహో' టీమ్ సరికొత్త ప్లాన్ చేసిందట. అదేమిటంటే.. ఈ సినిమా ట్రైలర్ను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయాలని చూస్తుందని తెలుస్తోంది.
మొత్తం నాలుగు భాషల్లో అదే రోజున ట్రైలర్ను లాంచ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాదు, దీని కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేయాలా..? లేక మామూలుగానే విడుదల చేయాలా..? అన్న కోణాల్లో కూడా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ చేస్తే.. ఎవరెవరిని పిలవాలి అన్నట్లు కూడా మంతనాలు జరుపుతున్నారని ఫిలింనగర్లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగానే చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం చిత్ర పరిశ్రమలోని ఎంతో మందిని ఆహ్వానిస్తారని సమాచారం. ఈ వేడుకను ఎక్కడ నిర్వహించాలన్న దానిపై క్లారిటీ వచ్చిన తర్వాత చిత్ర బృందం ప్రకటన చేయనుందని తెలుస్తోంది.