మెగా ఫ్యామిలీని టార్గెట్ : కొత్తజంటలో సంపూర్ణేష్?

అయితే తన పబ్లిసిటీ పెంచుకోవడానికి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు సంపూర్ణేష్. ఆ మధ్య 'పవనిజం' కాన్సెప్టును ఇమిటేట్ చేస్తూ 'సంపూర్ణిజం' జిందాబాద్ అంటూ లోగోలు వదిలాడు. తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ వార్త మెగా ఫ్యామిలీ హీరోతో సంబంధం ఉన్నది కావడం గమనార్హం.
ఈ రోజుల్లో, బస్టాప్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు శిరీష్ హీరోగా 'కిత్త జంట' రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో స్పెషల్ క్యారెక్టర్ చేయించే ప్లాన్లో ఉన్నారట. మరి ఈ వార్త నిజమేనా? లేక పబ్లిసిటీ పెంచుకోవడానికి సంపూర్ణేష్ ఇలాంటి వార్తలు ప్రచారంలోకి తెస్తున్నాడా? అనేది తేలాల్సి ఉంది.
గీతా అర్ట్స్ పతాకంపై బన్నీవాసు 'కొత్త జంట' చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అల్లు శిరీష్కు జోడీగా 'రొటీన్ లవ్స్టోరీ' ఫేమ్ రెజీనాను ఎంపిక చేశారు. శిరీష్ని ఈచిత్రంలో కొత్తగా చూపించబోతున్నారని, ఇంటిల్లీపాదీ అలరించేలా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











