Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగా ఫ్యామిలీని టార్గెట్ : కొత్తజంటలో సంపూర్ణేష్?
అయితే తన పబ్లిసిటీ పెంచుకోవడానికి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు సంపూర్ణేష్. ఆ మధ్య 'పవనిజం' కాన్సెప్టును ఇమిటేట్ చేస్తూ 'సంపూర్ణిజం' జిందాబాద్ అంటూ లోగోలు వదిలాడు. తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ వార్త మెగా ఫ్యామిలీ హీరోతో సంబంధం ఉన్నది కావడం గమనార్హం.
ఈ రోజుల్లో, బస్టాప్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు శిరీష్ హీరోగా 'కిత్త జంట' రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో స్పెషల్ క్యారెక్టర్ చేయించే ప్లాన్లో ఉన్నారట. మరి ఈ వార్త నిజమేనా? లేక పబ్లిసిటీ పెంచుకోవడానికి సంపూర్ణేష్ ఇలాంటి వార్తలు ప్రచారంలోకి తెస్తున్నాడా? అనేది తేలాల్సి ఉంది.
గీతా అర్ట్స్ పతాకంపై బన్నీవాసు 'కొత్త జంట' చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అల్లు శిరీష్కు జోడీగా 'రొటీన్ లవ్స్టోరీ' ఫేమ్ రెజీనాను ఎంపిక చేశారు. శిరీష్ని ఈచిత్రంలో కొత్తగా చూపించబోతున్నారని, ఇంటిల్లీపాదీ అలరించేలా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు.