అఖిల్ కథ మళ్లీ మొదటికే? వంశీ పైడిపల్లి తప్పుకున్నాడా? రీజన్ ఏంటి?
హైదరాబాద్ : నాగార్జున రెండో కుమారుడు అఖిల్ తన తొలి చిత్రం 'అఖిల్' డిజాస్టర్ కావటంతో రెండో చిత్రం విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని, ఏదీ ఇప్పటివరకూ మొదలుపెట్టలేదు. అప్పటికీ నాగార్జున తనే ఈ సారి అన్ని దగ్గరుండి చూసుకుందామని తనతో ఊపిరి వంటి హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి కు ఆ భాధ్యత అప్పచెప్పాడు.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి ...నో చెప్పి ప్రక్కకు తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నాగార్జున ..బాలీవుడ్ చిత్రం యే జవాని హై దీవాని ని అఖిల్ తో రీమేక్ చేయాలని, వంశీ పైడిపల్లిని ఆ పనిలో ఉండమని చెప్పారట. అయితే వంశీ పైడిపల్లి మొదటి ఓకే అన్నా తర్వాత... వరసగా రీమేక్ లు చేస్తే ...తనపై రీమేక్ లు మాత్రమే డీల్ చేయగలడనే ముద్ర పడుతుందని భావించి వద్దనుకున్నాడట.

దాంతో తను సొంతంగా ఓ కథ తయారు చేసుకుని అఖిల్ తో ముందుకు వెళ్దామనే ఆలోచనలో ఉన్నారట. కానీ నాగార్జున మాత్రం బాలీవుడ్ రీమేక్ నే చేసి హిట్ కొట్టాలనే ఉన్నారట. ఈ నేపధ్యంలో వంశీ పైడిపల్లి ఆ క్యాంప్ నుంచి బయిటకు వచ్చి ఎన్టీఆర్ తో కానీ రామ్ చరణ్ తో కానీ ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. గతంలో ఈ ఇద్దరు హీరోలతో బృందావనం, ఎవడు హిట్ కొట్టి ఉన్నాడు. మరి నాగార్డున ఏమంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











