Don't Miss!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హిట్టు ఎఫెక్ట్.. మాటల మాంత్రికుడిపై మహేష్ కోపం తగ్గినట్లేనా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో సత్తా చాటకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికి ఆ సినిమా ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టదు. టీవీలలో ఎన్ని సార్లు ప్రదర్శించిన మంచి రేటింగ్ ని అందిస్తుంది. అయితే ఆ తరువాత వచ్చిన ఖలేజా మాత్రం ఊహించని దెబ్బ కొట్టింది.
సినిమా మధ్యలో ఆగిపోవడంతో పాటు మహేష్ కెరీర్ ని ఒక్కసారిగా దెబ్బకొట్టడంతో త్రివిక్రమ్, మహేష్ లకు మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. సినిమా మిస్ ఫైర్ అవ్వడానికి వేరే కారణాలు ఉన్నప్పటికీ ఆ తరువాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని టాక్ వచ్చింది. కానీ మహేష్ కావాలనే త్రివిక్రమ్ ని రిజెక్ట్ చేశాడని కొంత కోపం ఉందనే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఫైనల్ గా వారిద్దరి మధ్య మనస్పర్థలు తొలిగినట్లు తెలుస్తోంది.
పైగా మాటల మాంత్రికుడు అల..వైకుంఠపురములో.. వంటి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడంతో ఏ హీరో అయినా ఆయన డేట్స్ అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నెక్స్ట్ త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అయిపోగానే మరొక సినిమాని వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ ఇటీవల మహేష్ కి ఒక కథను చెప్పాడట. మహేష్ కూడా సింగిల్ సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే